నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌

|

Mar 22, 2019 | 3:24 PM

పులివెందుల : కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి వచ్చిన ఆయన.. 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాగా  నామినేషన్ పత్రాలు సమర్పణకు ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు […]

నామినేషన్‌ వేసిన వైఎస్‌ జగన్‌
Follow us on

పులివెందుల : కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయానికి ఈరోజు మధ్యాహ్నం పార్టీ ముఖ్య నేతలతో కలిసి వచ్చిన ఆయన.. 1.49 గంటలకు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. కాగా  నామినేషన్ పత్రాలు సమర్పణకు ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగన్‌ నామినేషన్‌ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది.