అసెంబ్లీలో అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చిన రోజా

| Edited By:

Jul 29, 2019 | 7:25 PM

ఏపీ చరిత్రలో తొలిసారి మాట మీద నిలబడే సీఎం వచ్చారని.. ప్రజలు భావిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ.. పదేళ్లుగా ఏపీ ప్రజల ఎదురు చూపులు ఫలించాయన్నారు. జగన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ చూశాక రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని ప్రజలు సంతోషిస్తున్నారని అన్నారు. అలాగే.. ద్రవ్య వినిమయ బిల్లుపై మనసాక్షి ఉన్న ఎవరైనా వ్యతిరేకించరని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు. ఆయన మరణాన్ని.. […]

అసెంబ్లీలో అదిరిపోయే స్పీచ్‌ ఇచ్చిన రోజా
Follow us on

ఏపీ చరిత్రలో తొలిసారి మాట మీద నిలబడే సీఎం వచ్చారని.. ప్రజలు భావిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ.. పదేళ్లుగా ఏపీ ప్రజల ఎదురు చూపులు ఫలించాయన్నారు. జగన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ చూశాక రాజన్న రాజ్యం మళ్లీ వచ్చిందని ప్రజలు సంతోషిస్తున్నారని అన్నారు. అలాగే.. ద్రవ్య వినిమయ బిల్లుపై మనసాక్షి ఉన్న ఎవరైనా వ్యతిరేకించరని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేశారు. ఆయన మరణాన్ని.. తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోయారని.. గుండెలు పగిలేలా విలపించారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 50 రోజుల పరిపాలనతోనే రాజన్నను గుర్తుచేశారని చెప్పారు ఎమ్మెల్యే రోజా.