మోదీ చెంప అలా పగలగొడతా..!

| Edited By:

May 08, 2019 | 4:40 PM

ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకూ చేరుతోన్నాయి. బెంగాల్‌లో మమతా ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన దీదీ ‘ప్రజాస్వామ్యంతోనే మోదీ చెంప పగలగొట్టాలని ఉందని’ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని మమత విమర్శించారు. హిందువుల పండుగలు, ఉత్సవాలను అడ్డుకుంటున్నారంటూ బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపైనా దీదీ స్పందించారు. […]

మోదీ చెంప అలా పగలగొడతా..!
Follow us on

ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమత బెనర్జీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాజకీయ విమర్శలు, వ్యక్తిగత ఆరోపణల వరకూ చేరుతోన్నాయి. బెంగాల్‌లో మమతా ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని ప్రధాని మోదీ ఘాటు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన దీదీ ‘ప్రజాస్వామ్యంతోనే మోదీ చెంప పగలగొట్టాలని ఉందని’ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని మమత విమర్శించారు. హిందువుల పండుగలు, ఉత్సవాలను అడ్డుకుంటున్నారంటూ బీజేపీ నేతలు చేస్తోన్న ఆరోపణలపైనా దీదీ స్పందించారు. తాను బీజేపీ నినాదంతో ఏకీభవించనని, శ్రీరాముని పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఈ ఐదేళ్లల్లో ఒక్క రామ మందిరాన్నైనా నిర్మించిందా..? అని మమతా ప్రశ్నించారు.