ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజాసేవ మిన్న!

| Edited By:

May 20, 2019 | 5:30 PM

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదనీ, ఆ పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ క్రమంలో జనసేన నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఫలితాలతో ప్రసక్తి లేకుండా తాము నిత్యం ప్రజా సేవలో ఉంటామని లక్ష్మీనారాయణ తెలిపారు. తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. వీటిని చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23 […]

ఎగ్జిట్ పోల్స్ కన్నా ప్రజాసేవ మిన్న!
Follow us on

ఏపీ ఎన్నికల్లో జనసేన ప్రభావం పెద్దగా లేదనీ, ఆ పార్టీకి ఒకటి నుంచి రెండు సీట్ల వరకు మాత్రమే వస్తాయని పలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఈ క్రమంలో జనసేన నేత, విశాఖ లోక్ సభ అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఫలితాలతో ప్రసక్తి లేకుండా తాము నిత్యం ప్రజా సేవలో ఉంటామని లక్ష్మీనారాయణ తెలిపారు. తాను ఈ ఎగ్జిట్ పోల్స్ ను పట్టించుకోబోనని స్పష్టం చేశారు. వీటిని చూసి ఆందోళన చెందకుండా ఈ నెల 23 వరకు ఫలితాల కోసం ఎదురుచూడాలని జనసేన కార్యకర్తలు, అభిమానులను కోరారు. మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించి ప్రజల్లో అనవసరంగా ఉత్కంఠను కలిగిస్తున్నారని విమర్శించారు. తాము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై పెద్దగా ఉండదని వీవీ స్పష్టం చేశారు.