లోకేశ్ ప్రచారంపై విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‍పై, వైసీపీ నేత విజయసాయి రెడ్డి తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి లోకేశ్ ప్రచారంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్ ప్రచారానికి వెళ్తుంటే టీడీపీ అభ్యర్థులు ఎవరూ సహకరించడంలేదని, మీ నియోజకవర్గాన్ని చూసుకోండని చెబుతున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు అధిష్ఠానం పంపుతోన్న నిధులు అదృశ్యమవుతున్నాయని, డబ్బు తీసుకెళ్లిన‌వారు పరారవుతున్నారనే అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశారు. ‘వచ్చే నాలుగు రోజుల్లో 20 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించాలని […]

లోకేశ్ ప్రచారంపై విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు
Follow us

| Edited By: Vijay K

Updated on: Mar 29, 2019 | 7:21 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‍పై, వైసీపీ నేత విజయసాయి రెడ్డి తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి లోకేశ్ ప్రచారంపై ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లోకేశ్ ప్రచారానికి వెళ్తుంటే టీడీపీ అభ్యర్థులు ఎవరూ సహకరించడంలేదని, మీ నియోజకవర్గాన్ని చూసుకోండని చెబుతున్నారని విజయసాయి ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలకు అధిష్ఠానం పంపుతోన్న నిధులు అదృశ్యమవుతున్నాయని, డబ్బు తీసుకెళ్లిన‌వారు పరారవుతున్నారనే అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశారు.

‘వచ్చే నాలుగు రోజుల్లో 20 నియోజకవర్గాల్లో సుడిగాలి ప్రచారం నిర్వహించాలని ఉబలాటపడ్డ లోకేశ్‌కు అభ్యర్థుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. మా తిప్పలేవో మేం పడతాం. మీరు మంగళగిరి చూసుకోండి చాలు అని చెబుతున్నారట’ పాపం చిట్టినాయుడు పసి మెదడుకు లాజిక్ అర్థం కావడం లేదు!’ అంటూ ట్వీట్ చేశారు.

‘తెలుగుదేశం అభ్యర్థులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఫలానా వ్యక్తి ద్వారా నిధులు పంపిస్తున్నట్టు అభ్యర్థులకు పార్టీ అధిష్టానం సమాచారం అందిస్తోంది. హవాలా ఏజెంట్లు, కొన్ని విద్యా సంస్థల నుంచి నిధులు తీసుకెళ్లిన వ్యక్తులు డబ్బు మూటలతో అదృశ్యమవుతున్నారట. అభ్యర్థులు లబోదిబో అంటున్నారు.’అనిమరో ట్వీట్ వదిలారు విజయసాయి రెడ్డి.

‘కడుపుబ్బే కామెడీ ఉపన్యాసాలతో లోకేశ్ చులకన అవుతున్నారని కొందరు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట. మంగళగిరిలోనే ఉంటే మంచిదని చెప్పారట. ఏప్రిల్ 9న పోలింగు ఉంటుందని, బందరు పోర్టును ఎత్తుకుపోతారని అనడం చంద్రబాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదట. పుత్ర వాత్సల్యం కాబోలు!’ అంటూ గురువారం వ్యంగ్యంగా ట్వీట్ చేయడం విశేషం.