తొలి నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి.. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే

K Sammaiah

K Sammaiah |

Updated on: Feb 16, 2021 | 4:40 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలి నామినేషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత..

తొలి నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డి.. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెప్పేసిన మాజీ ఎమ్మెల్యే

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తొలి నామినేషన్‌ దాఖలైంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత చిన్నారెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీకి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగారు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి.

ఈనెల 23 వరకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 5 లక్షల 60 వేలమంది ఓటర్లున్నారు. తనను గెలిపిస్తే నిరుద్యోగ సమస్యపై రాజీలేని పోరాటం చేస్తానని, అవసరమైతే ఆమరణదీక్షకు దిగుతానన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డి. తాను అజాతశత్రువునని, అందరూ తనకు మద్దతు పలుకుతారనే నమ్మకంతో ఉన్నారు చిన్నారెడ్డి.

Read more:

వరంగల్‌ రూరల్‌ జిల్లాలో జోరుగా టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు.. కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటామన్న మంత్రి ఎర్రబెల్లి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu