పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత

రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని..

పంటలను నాశనం చేస్తున్న అడవి పందుల కాల్చివేత నిర్ణయాన్ని స్వాగతించిన షూటర్లు.. స్వచ్ఛందంగా పనిచేసేందుకు సుముఖత
Follow us

|

Updated on: Feb 12, 2021 | 11:53 AM

రైతుల పంటలను నాశనం చేస్తున్న అడవి పందులను కాల్చివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని లైసెన్స్ డ్ షూటర్ల బృందం స్వాగతించింది. ఎలాంటి రుసుము తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

కాల్చివేతకు అనుమతి ఉన్న 30 మంది షూటర్ల ఎంపానెల్ జాబితాను అటవీ శాఖ ఇప్పటికే వ్యవసాయ, హార్టీకల్చర్, పంచాయితీ రాజ్ శాఖలకు పంపింది. వీరిలో కొంతమంది అరణ్య భవన్ లో ఉన్నతాధికారులను కలిశారు. రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్న అడవి పందుల విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని, అటవీ శాఖ ఆదేశాల మేరకు తాము పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలుపుతూ పీసీసీఎఫ్ ఆర్. శోభకు లేఖను అందచేశారు.

సాధ్యమైనంతవరకు గ్రామ పంచాయితీల నుంచి అనుమతి వచ్చిన 48 గంటల్లోగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. కొద్ది మంది షూటర్లు పందుల కాల్చివేతకు రుసుము డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చిందని, మేము అందులో భాగం కాదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమీ ఆశించకుండా సొంత ఖర్చుతో, స్వచ్చందంగా కాల్చివేతలో పాల్గొంటామని తెలిపారు.

Read more:

బెంగుళూరులో టూరులో వైయస్‌ షర్మిల.. రెండు రాష్ట్రాలకు దూరంగా వ్యూహ రచన చేసేందుకేనంటున్న పరిశీలకులు