మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021 ప్రారంభించిన ప్రధాని మోదీ.. నౌకాశ్రయాల పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం జగన్‌

మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో..

మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021 ప్రారంభించిన ప్రధాని మోదీ.. నౌకాశ్రయాల  పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న సీఎం జగన్‌
Follow us

|

Updated on: Mar 02, 2021 | 3:42 PM

మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొన్నారు. పరిశ్రమలశాఖమంత్రి మేకపాటి గౌతంరెడ్డి, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలెవన్‌, పశుసంవర్ధక, మత్స్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఛైర్మన్‌ కె రామ్మోహన్ రావు, పోర్ట్స్ డైరెక్టర్‌ రామకృష్ణారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌ –2021 ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ప్రపంచ సముద్రయాన (మారిటైమ్‌) రంగంలో భారత్‌ ఒక విశిష్ట గుర్తింపును సాధిస్తుందన్న విశ్వాసం తనకెందో ఉందన్నారు జనగ్‌. పారిశ్రామిక పురోగతి, పోర్టు ఎకానమీ (నౌకాశ్రయాల ద్వారా ఆర్థిక ప్రగతి)కి భారత్, ముఖ్యంగా రేవులు కలిగిన రాష్ట్రాలు ముఖ్యభూమిక పోషించాయి. ఈ సుదీర్ఘ పయనంలో ఇప్పుడు నిర్వహిస్తున్న ‘భారత సముద్రయాన సదస్సు’ (మారిటైమ్‌ ఇండియా సమ్మిట్‌) ఒక మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాను’అని సీఎం జగన్‌ చెప్పారు.

దేశ వాణిజ్య రంగంలో 95 శాతం, ఆ వాణిజ్య విలువలో 70 శాతం వరకు సముద్ర యానం ద్వారానే జరుగుతోంది. గత ఏడాది (2019–20)లో దేశంలోని నౌకాశ్రయాల ద్వారా 1.2 బిలియన్‌ మెట్రిక్‌ టన్నుల కార్గో రవాణా జరిగింది. 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ), మేక్‌ ఇన్‌ ఇండియా, సాగర్‌ మాల, భారత్‌ మాల వంటి సంస్కరణల ప్రక్రియ ఈ రంగంలో విశేష పురోగతికి ఎంతో దోహదం చేశాయి. ఆ దిశలో రూపొందించిన మారిటైమ్‌ ఇండియా విజన్‌ 2030 డాక్యుమెంట్‌ ఈ రంగంలో ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకిత భావానికి ఒక నిదర్శనంలా నిలుస్తుంది’ అని సీఎం జగన్‌ అన్నారు.

దేశ ఆర్థిక పురోగతిలో బ్లూ ఎకానమీ (మత్స్య సంపద, సముద్ర ఉత్పత్తులు ద్వారా వచ్చే ఆర్థిక ప్రగతి) అన్నది సముద్ర యానం ద్వారా జరిగే వాణిజ్య కార్యకలాపాలు, ఎగుమతులు, దిగుమతుల గణాంకాల ఆధారంగానే కాకుండా, ఈ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన అనుబంధ విభాగాలు.. ఆక్వా కల్చర్, సముద్ర యానం (మారిటైమ్‌), సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటక రంగం, రసాయన మరియు జీవ సాంకేతిక పరిశోధన, నౌకల నిర్మాణం (షిప్‌ బిల్డింగ్‌), నౌకాశ్రయాలపై ఆధారపడిన పరిశ్రమల వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుంది. అవన్నీ కలిసికట్టుగా పని చేస్తే, ఈ రంగంలో దేశం కాంక్షిస్తున్న పురోగతితో పాటు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మరింత మెరుగు పరుస్తాయి, గత ఏడాది సెప్టెంబరులో ప్రభుత్వం విడుదల చేసిన మొట్టమొదటి జాతీయ మత్స్య విధాన ముసాయిదా, ఆ దిశలో ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలకు ఉదాహరణగా కనిపిస్తున్నాయన్నానరు.

సముద్ర యానం ద్వారా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చి, అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్న స్ఫూర్తిదాయక ఎజెండాను ఆదర్శంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో పలు చర్యలు తీసుకుందని సీఎం జగన్‌ వివరించారు. రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ తీర ప్రాంతం ఉంది. ఇది దేశంలోనే రెండో పెద్ద తీర ప్రాంతం కాగా, భారత తూర్పు తీరంలో అత్యంత పొడవైన తీర ప్రాంతమని సీఎం జగన్‌ అన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ తాజాగా విడుదల చేసిన 2020 ఏడాది ర్యాంకింగ్స్‌ ప్రకారం, ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ (సులభతర వ్యాపారం)లో ఈరోజు రాష్ట్రం తొలి స్థానంలో నిల్చిందని చెప్పడానికి గర్వంగా ఉందన్నారు సీఎం జగన్‌. నౌకాశ్రయాలలో మౌలిక వసతుల కల్పన, వాటిపై ఆధారపడిన పరిశ్రమలకు నిరంతర ప్రోత్సాహం వంటి చర్యల ద్వారానే ఇది సాధ్యమైందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖలో అతి పెద్ద నౌకాశ్రయంతో పాటు, అయిదు చోట్ల నౌకాశ్రయాలు, మరో పది గుర్తించిన ఓడరేవులు ఉన్నాయి. వాటన్నింటిలో ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పించడం ద్వారా ఏటా 170 మిలియన్‌ టన్నులకు పైగా సరుకుల (కార్గో) రవాణా జరుగుతోంది. కార్గో రవాణాలో గుజరాత్‌ అగ్ర స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిల్చింది. మొత్తం దేశీయ దిగుమతుల్లో రాష్ట్ర నౌకాశ్రయాలు, ఓడరేవుల ద్వారా 4 శాతం వరకు కొనసాగుతుండగా, 2030 నాటికి కనీసం 10 శాతం దిగుమతులు రాష్ట్రం గుండా జరగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం జగన్‌ చెప్పారు.

నౌకాశ్రయాలపై ఆధారపడి, అవే ప్రధాన కేంద్రాలుగా ఇటీవల రాష్ట్రానికి పలు పరిశ్రమలు వచ్చాయి. ఈ రంగంలో ఉన్న మరిన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మూడు చోట్ల.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు వద్ద పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించకుండా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉండే హరిత క్షేత్ర ఓడరేవుల (గ్రీన్‌ ఫీల్డ్‌ పోర్ట్స్‌)ను అభివృద్ధి చేస్తోంది. తద్వారా ఈ పోర్టుల నిర్వహణ అత్యంత సులువు కానుంది. ప్రైవేటు రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవి సజావుగా పని చేసే విధంగా వాటి నిర్మాణం జరుగుతోంది. ఆ ఓడరేవుల నిర్మాణాలు పూర్తైన తర్వాత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చే విధంగా, పోటీ పద్ధతిలో (కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌) వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని సీఎం జగన్‌ వివరించారు.

సరుకుల రవాణాకు పూర్తి అనుకూలంగా ఉండే (వాతావరణపరంగానూ, పెద్ద ఓడలు వచ్చే విధంగా లోతుగానూ) ఈ ఓడరేవులు 2023 నాటికి సిద్ధమవుతాయి. తద్వారా స్వల్ప కాలంలోనే ఏటా అదనంగా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకుల రవాణా (కార్గో) సాధ్యమవుతుంది. ఆ తర్వాత దీర్ఘకాలంలో అది మరింత పెరిగేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, ఓడరేవులన్నీ పూర్తి సామర్థ్యంతో పని చేసే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. సరుకుల రవాణాకు ఓడరేవులపైనే ఎక్కువగా ఆధారపడే తయారీ రంగం, పెట్రో కెమికల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్‌ రంగాలలో పెట్టుబడులను విశేషంగా ఆకర్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఈ రంగంలో నైపుణ్యాలను పెంచడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు, 8 ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తోంది. ఇంకా టెస్టింగ్‌ ల్యాబ్‌లు, శీతల గిడ్డంగులు (కోల్డ్‌ ఛైన్‌ ఫెసిలిటీ) కూడా ఏర్పాటు చేస్తోంది. వీటన్నింటితో ఆయా పోర్టుల ద్వారా కార్గో రవాణాలో ఆక్వా, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగనుందని సీఎం జగన్‌ చెప్పారు.

నిర్దిష్ట చర్యలు, ప్రక్రియల ద్వారా ఓడరేవులు, నౌకాశ్రయాలపై ఆధారపడిన పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక పురోగతి సాధించడంతో పాటు, సువిశాల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంలో నూతన ఆర్థిక నగరాల నిర్మాణం జరిగేలా ప్రభుత్వం పని చేస్తోంది. చివరగా, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావాలని సదస్సుకు హాజరైన దేశ, విదేశీ కంపెనీల ప్రతినిధులందరినీ సీఎం జగన్‌ ఆహ్వానించారు. మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తి సహాయ, సహకారాలు అందజేస్తుందని అందుకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. అంతే కాకుండా పరిశ్రమల నిర్వహణకు పూర్తి అనువైన వాతావరణం, పరిస్థితులు ఉంటాయని, మీ ప్రతి అడుగులో ప్రభుత్వం తోడుగా నిలుస్తుందని సీఎం జగన్‌ భరోసా కల్పించారు.

Read more:

నడిగడ్డలో గర్జించిన మంత్రులు.. పీవీ కుమార్తెకు అలంపూర్‌ ప్రజలు అండగా నిలవాలని పిలుపు

కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా