జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ తేదీలను ఆ పార్టీ ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుండి ఒకచోట, గోదావరి జిల్లాల నుండి మరోచోట అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేయనున్న సంగతి తెలిసిందే. ఈనెల 21న విశాఖ జిల్లా గాజువాక నుండి, ఈనెల 22న తూర్పు గోదావరి జిల్లా భీమవరం నుండి నామినేషన్ వేయనున్నారు. అయితే 21న హొలీ సందర్భంగా సెలవుదినం కావడంతో తెలంగాణలో నామినేషన్లను స్వీకరించడం లేదని సీఈఓ రంజిత్ కుమార్ తెలపగా ఏపీ ఎన్నికల సంఘం ఇప్పటి వరకు అలాంటి ప్రకటన చేయలేదు.
21న గాజువాకలో, 22న భీమవరంలో శ్రీ పవన్ కల్యాణ్ గారు నామినేషన్ @PawanKalyan pic.twitter.com/dZ2yOQXSz7
— JanaSena Party (@JanaSenaParty) March 19, 2019