పవన్ కళ్యాణ్ మోసం చేశారు: అల్లు భానుమతి

|

Mar 21, 2019 | 1:37 PM

విజయవాడ: పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాడుగుల నుంచి జనసేన టికెట్ ఇస్తానని పవన్ చెప్పారని కానీ మోసం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశానికి మేలు చేసేలా సన్యాసినాయుడికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. తాము జనసేన గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన తర్వాత వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను రోడ్డుపై వదిలేశారని అన్నారు. ప్రశాంతంగా […]

పవన్ కళ్యాణ్ మోసం చేశారు: అల్లు భానుమతి
Follow us on

విజయవాడ: పవన్ కళ్యాణ్ తమను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ మాడుగుల నుంచి జనసేన టికెట్ ఇస్తానని పవన్ చెప్పారని కానీ మోసం చేశారని అన్నారు. తనకు టికెట్ ఇవ్వకుండా తెలుగుదేశానికి మేలు చేసేలా సన్యాసినాయుడికి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు.

తాము జనసేన గెలుపు కోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిన తర్వాత వేరే వ్యక్తికి టికెట్ ఇవ్వడం ద్వారా తమను రోడ్డుపై వదిలేశారని అన్నారు. ప్రశాంతంగా ఉంటున్న తమ కుటుంబాన్ని, టికెట్ ఇస్తానని చెప్పి తిరిగి రాజకీయాల్లోకి పవన్ రప్పించారు కానీ మోసం చేశారు. ఉన్నత చదువులు చదివిన తన మనవడు రఘురాజు భవిష్యత్తు కోసమే జనసేనలో చేరాను అంటూ భానుమతి ఆవేదన వ్యక్తం చేశారు.