AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్గీరాజాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌.. ఆ కేసులో ఆదేశాల ఉల్లంఘనపై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు..

డిగ్గీరాజాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌.. ఆ కేసులో ఆదేశాల ఉల్లంఘనపై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం
K Sammaiah
|

Updated on: Feb 22, 2021 | 5:52 PM

Share

కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు దిగ్విజయ్ సింగ్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయ్యింది. ఎంఐఎం నాయకుడు హుస్సేన్ అన్వర్ దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి విచారణకు హాజరుకాకపోవడంతో ప్రజా ప్రతినిధుల కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ను జారీచేసింది.

2016లో ఓ కార్యక్రమంలో ప్రసంగించిన దిగ్విజయ్ సింగ్ ఎంఐఎం నేతలపై పలు ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలను సవాలు చేస్తూ ఆ పార్టీ నాయకుడు హుస్సేన్‌ అన్వర్‌ స్థానిక కోర్టులో పరువ నష్టం దావా వేశారు.ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన్నప్పటికీ పలుమార్లు ఉల్లంఘించారు. దీంతో తాజాగా అరెస్ట్‌ వారెంట్‌జారీ అయ్యింది.

అయితే అనారోగ్యం కారణంతో నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాల్సిందిగా దిగ్విజయ్‌సింగ్ చేసిన అభ్యర్థనను ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తొసిపుచ్చింది. విచారణను మార్చి 8కి వాయిదా వేసింది.

Read more:

మున్సిపాల్టీ ఎన్నికల్లో కొత్త జిల్లాల రగడ.. డిప్యూటీ స్పీకర్‌ కామెంట్స్‌తో కాగుతున్న కాంట్రవర్సీ