వయనాడ్లో రీపోలింగ్ జరపాలి : ఎన్డీఏ అభ్యర్ధి
త్రివేండ్రం : కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్ధిగా తుషార్ వెల్లపల్లి బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థి తుషార్.. రీపోలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముప్పనాడ్ పంచాయితీలోని ఓ స్కూల్లో ఉన్న ఈవీఎం మొరాయించిందని, రెండు సార్లు బటన్ నొక్కినా ఓటు […]
త్రివేండ్రం : కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్ధిగా తుషార్ వెల్లపల్లి బరిలో ఉన్నారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇవాళ కొన్ని చోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ఎన్డీఏ అభ్యర్థి తుషార్.. రీపోలింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. ముప్పనాడ్ పంచాయితీలోని ఓ స్కూల్లో ఉన్న ఈవీఎం మొరాయించిందని, రెండు సార్లు బటన్ నొక్కినా ఓటు పడడం లేదని ఆయన ఆరోపించారు.