నామినేషన్ వేసిన నవీన్ పట్నాయక్

|

Mar 20, 2019 | 5:53 PM

భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన ఈ ఎన్నికలలో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్‌. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్‌ 18న సెకండ్ ఫేజ్‌లో జరగనున్నాయి. హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా హింజిలీ నుంచి పోటీచేయడం […]

నామినేషన్ వేసిన నవీన్ పట్నాయక్
Follow us on

భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ పార్టీ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన ఈ ఎన్నికలలో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయబోతున్నారు. అందులో ఒక స్థానం హింజిలీ కాగా మరొకటి బిజేపూర్‌. ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు ఏప్రిల్‌ 18న సెకండ్ ఫేజ్‌లో జరగనున్నాయి. హింజిలీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఛత్రాపూర్‌ సబ్‌ కలెక్టర్‌ ఆఫీసులో నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కాగా హింజిలీ నుంచి పోటీచేయడం పట్నాయక్‌కి ఇది ఐదోసారి. త్వరలోనే బిజేపూర్‌లో మరో నామినేషన్‌ను వేయనున్నారు. మళ్లీ ఒడిషాలో తామే గెలుస్తామని, బీజేడీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్న ధీమాని పట్నాయక్‌ వ్యక్తం చేశారు. నామినేషన్‌కు ముందు హింజిలీకి సమీపంలోని తరాతరిని దేవాలయాన్ని నవీన్‌ పట్నాయక్‌ సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు.