ఆ ఇద్దరిని ఉతికి ఆరేసిన కొడాలి నాని.. రాసిచ్చింది చదవడం తప్పా ఏమీ చేయలేరన్న మంత్రి

|

Mar 06, 2021 | 2:09 PM

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, చంద్రాబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో..

ఆ ఇద్దరిని ఉతికి ఆరేసిన కొడాలి నాని.. రాసిచ్చింది చదవడం తప్పా ఏమీ చేయలేరన్న మంత్రి
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఫుల్‌ జోష్‌ మీదున్న అధికార పార్టీ వైసీపీ నేతతు మున్సిపాల్టీ ఎన్నికలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే అత్యధిక మున్సిపాల్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని వైసీపీ నేతలు వ్యూహరచన చేశారు. ఆ మేరకు ఇప్పటికే చాలా మున్సిపాల్టీలు ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, చంద్రాబాబు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో విరుచుకు పడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని, మన రాష్ట్రంలోని పరిస్థితులు ఆయనకు తెలియవని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదవడం తప్ప బాలయ్య ఏమీ చేయలేడన్నారు కొడాలి నాని. బాలకృష్ణ ఆటలో అరటిపండు లాంటివాడంటూ కొడాలి నాని సంచల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, ఆయనకు మైండ్ చెడిపోయిన విషయం అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు. విశాఖ ఉక్కు విషయంలో మోదీని ప్రశ్నించలేక జగన్‌పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ఒక శనిగ్రహం అని, ఈ విషయం ఎన్టీయార్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. శని వదలాలంటే చంద్రబాబుకు పూజలు చేయాలని, వాళ్ల పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టు తిరుగుతున్నారని కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు బాలకృష్ణ హిందూపురం మున్సిపాల్టీలో ప్రచారం నిర్వహిస్తూ వైసీపీపై ధ్వజమెత్తారు. తాను ప్ర‌జాసేవ‌లో ఉన్నాన‌ని, తన‌ను ఎవ‌రైనా విమ‌ర్శిస్తే ఊరుకోబోన‌ని టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ హెచ్చ‌రించారు.

తాను హిందూపురంలో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాన‌ని చెప్పారు. అలాగే కేన్స‌ర్ ఆసుప‌త్రి ఛైర్మ‌న్‌గానూ ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తున్నాన‌ని తెలిపారు. సినిమాల్లో న‌టన‌‌తో ప్ర‌జ‌లకు మంచి వినోదంతో పాటు సందేశాలు అందిస్తున్నాన‌ని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌లో వైసీపీ ప్ర‌జ‌ల‌కు ఏం చేసిందో చెప్పే ధైర్యం ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌ని అన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్రం అభివృద్ధిని ప‌క్క‌న‌పెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నార‌ని బాలకృష్ణ విమ‌ర్శించారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు.

త‌మ‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ స‌ర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టింద‌ని ఆయ‌న చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది త‌మ పార్టీ మాత్ర‌మేన‌ని అన్నారు. నలుగురు మంత్రులు త‌మ పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడుని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. బాలకృష్ణకు కౌంటర్‌గా మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించడంతో రాజకీయంగా కాక రేగుతుంది.

Read More:

ఏపీ అధికార పార్టీలో అలజడి రేపుతున్న నాన్‌బెయిలబుల్‌ వారెంట్స్‌.. ఇంతకీ ఆ మంత్రి, ఎమ్మెల్యే చేసిన తప్పేంటి..?