నామినేషన్ల ప్రక్రియ తర్వాతే కేసీఆర్ సభలు

| Edited By:

Mar 23, 2019 | 6:09 PM

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 17న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌, 19న నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగే సభల షెడ్యూల్‌ శుక్రవారం వరకు ఖరారు […]

నామినేషన్ల ప్రక్రియ తర్వాతే కేసీఆర్ సభలు
Follow us on

టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ తిరిగి ఈనెల 25 తర్వాతే లోక్‌సభ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనే అవకాశం ఉంది. గురువారమే ఎంపీ అభ్యర్థులను ప్రకటించటం, వారంతా నామినేషన్ల దాఖలు హడావుడిలో ఉండటంతో కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈనెల 17న కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌ సభ ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్‌, 19న నిజామాబాద్‌ సభలో పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగే సభల షెడ్యూల్‌ శుక్రవారం వరకు ఖరారు కాలేదు. ఇదిలా ఉండగా, టీఆర్‌ఎస్‌ సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులు తలసాని సాయికిరణ్‌ యాదవ్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డిలు శుక్రవారం సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ను వారి క్యాంపు కార్యాలయాల్లో కలిశారు. ఈ సందర్భంగా ప్రచారానికి సంబంధించి సీఎం కేసీఆర్‌ అభ్యర్థులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది.