సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కళావెంకట్రావు

| Edited By:

Mar 25, 2019 | 10:13 AM

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ జెండా వెనుక దాక్కొని కేసీఆర్ దొంగ యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. నేరుగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతో వైసీపీ జెండా నీడలో సీఎం చంద్రబాబుపై దొంగ యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఏపీలో సామంతరాజును ఏర్పాటు చేసుకుని క‌ష్ణా, గోదావరి జలాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ఏపీ పరిశ్రమలను దెబ్బకొట్టేందుకే […]

సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన కళావెంకట్రావు
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ జెండా వెనుక దాక్కొని కేసీఆర్ దొంగ యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. నేరుగా ఎదుర్కొనే సత్తా లేక ఇలా వైసీపీ పార్టీని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. మోడీ ఆదేశాలతో వైసీపీ జెండా నీడలో సీఎం చంద్రబాబుపై దొంగ యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఏపీలో సామంతరాజును ఏర్పాటు చేసుకుని క‌ష్ణా, గోదావరి జలాలను హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ఏపీ పరిశ్రమలను దెబ్బకొట్టేందుకే కేసీఆర్ ఆలోచిస్తున్నారని విమర్శించారు కళా. కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ఏపీలో ప్రత్యక్షంగా పోటీ చేయాలని సవాల్ విసురుతూ లేఖలో పేర్కొన్నారు కళా వెంట్రావ్.