Pawan Kalyan: ‘అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే..’.. పొత్తులపై చర్చల వేళ జనసేనాని సంచలన ట్వీట్

పవన్ కల్యాణ్ వేసిన తాజా ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన జనసేన కార్యకర్తలను అలెర్ట్ చేస్తూ ఈ ట్వీట్ వేసినట్లు అర్థమవుతుంది.

Pawan Kalyan: అది మైండ్ గేమ్‌లో ఒక భాగమే.... పొత్తులపై చర్చల వేళ జనసేనాని సంచలన ట్వీట్
Pawan Kalyan

Updated on: Jun 08, 2022 | 5:42 PM

Janasena: ఏపీలో పొత్తుల గురించి ప్రధాన పార్టీల నేతల మధ్య డైలాగులు పేలుతున్న వేళ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు  చర్చయనీయాంశమయ్యాయి. జనసేన కారకర్తలను ఉద్దేశించి.. వారిని అలెర్ట్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేసినట్లు అర్థమవుతుంది.

“జర భద్రం ————— అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తెరగండి” అని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.