AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తోన్న పార్టీలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై చర్చించేందుకు రేపు ఆల్ పార్టీ మీటింగ్‌ను లోక్ సభ స్పీకర్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇక  దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.  20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటనను విడుదల చేశారు.  ప్రశాంత […]

18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు..అస్త్ర శస్త్రాలను సిద్దం చేస్తోన్న పార్టీలు
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 16, 2019 | 10:57 PM

Share

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 18నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిపై చర్చించేందుకు రేపు ఆల్ పార్టీ మీటింగ్‌ను లోక్ సభ స్పీకర్ నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్‌లో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఇక  దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులకు పార్లమెంట్ కార్యాలయం నుంచి సమాచారం అందింది.  20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నట్టు స్పీకర్ ఓం బిర్లా ప్రకటనను విడుదల చేశారు.  ప్రశాంత వాతావరణంలో సమావేశాలు జరుపుకుందామని, అందుకు అందరూ సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి కోరారు. కాగా ఎల్లుండి మరోసారి పార్టీల పార్లమెంటరీ నాయకులతో జోషి భేటి అవ్వనున్నారు. కాగా ఈ సమావేశాల్లో పలు రకాల బిల్లులను పాస్ చెయ్యాలని, కీలక ఆర్డినెస్సులను తీసుకురావాలని బీజేపీ భావిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం-1961, ఆర్థిక చట్టం-2019లను సవరిస్తూ.. దేశీయ కంపెనీల కార్పొరేట్‌ పన్నును తగ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తోపాటు ఇ-సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేదిస్తూ తీసుకొచ్చిన అర్డినెన్స్‌  బీజేపీ ప్రధాన టార్గెట్‌గా తెలుస్తోంది. ఇక ఆర్థిక మందగమనంపై ప్రధానంగా అధికార పక్షాన్ని టార్గెట్ చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది.

సన్నద్దమైన తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలు:

పార్లమెంట్ సమావేశాల్లో ఎటువంటి వ్యూహం అనుసరించాలన్న విషయంపై వైసీపీ అధినేత జగన్‌తో..ఎంపీలు భేటీ అయ్యారు. ముఖ్యంగా ..ఏపీకి ప్రత్యేక హోదా, పెండింగ్ నిధులు వంటి కీలక అంశాలపై జగన్ ఫోకస్ చెయ్యమన్నట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశాలను స్కిప్ చెయ్యెద్దని ఎంపీలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన అంశాలపై మీడియాతో మాట్లాడేటప్పడు సైతం..సంయమనంతో వ్యవహరించాలని..ప్రత్యేక హోదా ప్రధాన టార్గెట్ అని జగన్ ఎంపీలకు స్పష్టం చేశారు.

………………………………………

ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేడు భేటీ అయ్యింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహలపై సభ్యలు కీలక చర్చ జరిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చెయ్యమన్నట్లు సమాచారం.

Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..