Delhi Tour : నేడు ఢిల్లీకి సేనాని..రీజన్స్ ఇవే..

|

Feb 20, 2020 | 10:28 AM

జనసేన అధినేత ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక వరుస ఢిల్లీ పర్యటనలతోనూ హల్‌చల్ చేస్తున్నారు.

Delhi Tour : నేడు ఢిల్లీకి సేనాని..రీజన్స్ ఇవే..
Follow us on

Delhi Tour :  జనసేన అధినేత ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఒకవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక వరుస ఢిల్లీ పర్యటనలతోనూ హల్‌చల్ చేస్తున్నారు. గత నెలలో ఆయన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు. అపై ఏపీలో బీజేపీతో జతకట్టి ముందుకు వెళ్తున్నారు. ఇక నేడు(గురువారం) మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు పవన్.  గతంలో ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే సందర్భంగా.. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి పవన్ కోటి రూపాయల విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.  తాజా ఢిల్లీ పర్యటనలో కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి..అందుకు సంబంధించిన చెక్‌ను సైనికాధికారులకు అందించనున్నారు.

ఇక మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పవన్ చీఫ్ గెస్ట్‌గా పాల్గొననున్నారు. పలువురు విద్యార్థుల సందేహాలకు  సమాధానాలు ఇవ్వనున్న జనసేనాని..కీలక ప్రసంగం కూడా చేయనున్నారు.  ఈ సందర్భంగా పవన్‌పై రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌ను ఈ సదస్సులో ప్రదర్శించనున్నారు.   ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా మేఘాలయ అసెంబ్లీ స్పీకర్ మెత్బా లింగ్డో కూడా పాల్గొంటారు.