AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చంద్రబాబు ఓటమి తథ్యం- కేసీఆర్‌

వికారాబాద్‌:  ఏపీ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారు. డిపాజిట్‌ కూడా రాదు. వైసీపీ గెలుపు ఖాయం. బాబు కహానీ ఖతం’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మంచివాళ్లని.. వారితో తమకు పంచాయితీ లేదని అన్నారు. చంద్రబాబు వంటి నీచ రాజకీయాలు చేసేవాళ్లతోనే తమకు గొడవలని అన్నారు. చంద్రబాబు చిత్తుగా […]

చంద్రబాబు ఓటమి తథ్యం- కేసీఆర్‌
Ram Naramaneni
|

Updated on: Apr 08, 2019 | 7:47 PM

Share

వికారాబాద్‌:  ఏపీ ఎన్నికలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ పబ్లిక్ మీటింగ్‌లో ఆయన ప్రసంగించారు. ‘ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారు. డిపాజిట్‌ కూడా రాదు. వైసీపీ గెలుపు ఖాయం. బాబు కహానీ ఖతం’ అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మంచివాళ్లని.. వారితో తమకు పంచాయితీ లేదని అన్నారు. చంద్రబాబు వంటి నీచ రాజకీయాలు చేసేవాళ్లతోనే తమకు గొడవలని అన్నారు. చంద్రబాబు చిత్తుగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. చంద్రబాబులా చీకటి పనులు, కుట్రలు తాము చేయలేమని కేసీఆర్‌ అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో చెప్పామని.. ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. పోలవరానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్న కేసీఆర్‌..  రాజకీయాల కోసం చంద్రబాబులా అబద్ధాలు చెప్పబోమన్నారు. తెలంగాణ ఎంపీలు 17 మందికి.. జగన్‌ ఎంపీలు సహకరిస్తే .. అంతా కలిసి తెలుగు రాష్ట్రాల హక్కులు సాధించుకుంటామని తెలిపారు.