AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సీఎస్‌, డీజీపీతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక చర్చలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగుతున్న..

ఏపీ సీఎస్‌, డీజీపీతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ భేటీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కీలక చర్చలు
K Sammaiah
|

Updated on: Feb 11, 2021 | 1:20 PM

Share

ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో సాగుతున్న ఎన్నికలు.. తొలిదశ పోలింగ్‌ ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ సీఎస్‌ ఆదిత్యనథ్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌లతో భేటీ అయ్యారు.

ఫస్ట్‌ ఫేజ్‌లో వచ్చిన ఇబ్బందులేంటి? మిగతా దశలకు ఏర్పాట్లు ఎలా ఉండాలి? అనే అంశాలపై ఏపీ సీఎస్, డీజీపీతోSEC నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చర్చించారు. తొలిదశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల సిబ్బంది, అధికారులను అభినందించారు నిమ్మగడ్డ రమేశ్ కుమార్.

మిగిలిన మూడు దశల ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. మొదటి దశ స్ఫూర్తితోనే మిగతా మూడు దశల ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా చూడాలని అధికారులను నిమ్మగడ్డ కోరారు.

Read more:

పార్టీ ఏర్పాటుపై స్పీడ్‌ పెంచిన షర్మిల.. థర్టీ డేస్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్న వైఎస్సార్‌టీపీ టీం