AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్‌ క్లాస్‌..

సింహపురి పొలిటికల్‌ పంచాయతీ సీఎం జగన్‌ తేల్చేశారు. గంట సమయం పాటు ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. సీనియర్లే ఇలా చేస్తే ఎలా ప్రశ్నించిన సీఎం జగన్‌ ప్రశ్నించారు. పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని..  ఏదైనా ఉంటే..

CM Jagan: సీనియర్లే ఇలా చేస్తే ఎలా.. మంత్రి కాకాని, అనిల్‌కు సీఎం జగన్‌ క్లాస్‌..
Cm Jagan Had An Hour Long M
Sanjay Kasula
|

Updated on: Apr 20, 2022 | 7:06 PM

Share

సింహపురి పొలిటికల్‌ పంచాయతీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jagan) తేల్చేశారు. గంట సమయం పాటు ఇద్దరికీ క్లాస్ తీసుకున్నారు. సీనియర్లే ఇలా చేస్తే ఎలా ప్రశ్నించిన సీఎం జగన్‌ ప్రశ్నించారు. పార్టీ కోసం కలిసికట్టుగా పని చేయాలని..  ఏదైనా ఉంటే తనతోనే సంప్రదించాలని సూచించారు. నెల్లూరు జిల్లా వైసీపీ పంచాయితీ చేరింది. ముఖ్యమంత్రి కార్యాలయం బుధవారం తాజా, మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy), అనిల్ కుమార్ యాదవ్‌లను(Anil Kumar Yadav) సీఎం జగన్‌తో భేటీకి ఆహ్వానించింది. దీంతో బుధవారం మధ్యాహ్నం సీఎం జగన్మోహన్ రెడ్డితో అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారు. మాజీ మంత్రి అనిల్‌తో భేటీ అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చేరుకుని.. జగన్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే నెల్లూరు వైసీపీ నేతల పంచాయితీకి ఎండ్ కార్డ్ పడింది.

అయితే.. సమావేశం అనంతరం మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ.. అనిల్‌కు తనకు మధ్య ఎక్కడా విభేదాలు లేవని తేల్చి చెప్పారు. తాము ఎక్కడా పోటా పోటీ సభలు నిర్వహించలేదన్నారు. పోటా పోటీ సభలు అనేవి మీడియా సృష్టి అంటూ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితితుల్లో నిప్పు లేకుండానే పొగ వస్తుందన్నారు. నెల్లూరులో అంతా ఫ్రెండ్లీ వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు. నీడనిచ్చే చెట్టునే నరుక్కునే మూర్ఖులం తాము కాదన్నారు. సీఎం జగన్ తిరిగి సీఎం కావడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. తనకు అనిల్‌కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్నారు. నెల్లూరులో ఎవరి ఫ్లక్సీలను ఎవరూ చింపలేదన్నారు. ఇరువురూ సమన్వయంతో కలిసి పనిచేయాలని సీఎం జగన్ ఆదేశించారని.. పార్టీ అభివృద్ది సంక్షేమం గురించే సీఎంతో మాట్లాడినట్లుగా వెల్లడించారు. ఇతర అంశాలు చర్చకు రాలేదన్నారు.

కాగా, మంత్రి కాకాణి, ఆనం, వేంరెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా అనిల్ యాదవ్ పనిచేస్తున్నారంటూ ఆయా వర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేశాయి. అలాగే, తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారంటూ అనిల్ సైతం కంప్లైంట్ ఇచ్చారు. దీంతో మాజీ మంత్రి అనిల్‌ యాదవ్‌కు, కాకాణికి ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్‌ను అనిల్‌ కుమార్‌ యాదవ్ ఈ సమావేశం జరిగింది.

పరస్పరం ఆరోపణలు చేసుకున్న అనిల్‌, కాకాణిలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలకు శుభం కార్డు పడుతుందో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి: Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 Minister Kishan Reddy: రైతుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం ఆడుకుంటోంది.. వరి కొనుగోళ్లలో విఫలమైందన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..