యూపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో తమదైన శైలిలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. అయితే తాజాగా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీని ఎదుర్కొనేందుకు తనదైనశైలిలో వ్యూహాలు రచించారు. ఏకంగా యూపీ సీఎం యోగి లాంటి వ్యక్తిని రంగంలోకి దించారు. అయితే ఆ బాబా మొఖాన్ని మాత్రం చూపించలేదు. ఈ డూప్ యోగి బాబాకు సంబంధించిన ఫోటోలను అఖిలేశ్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మేము నకిలీ దేవుడిని తీసుకురాలేదని.. ఒక బాబాను తీసుకొచ్చామంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గోరఖ్పూర్ నుంచి ఆ బాబా మాతో వచ్చారని.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అసలైన నిజాలను యూపీ వాసులకు వివరిస్తారని అన్నారు.
हम नक़ली भगवान नहीं ला सकते पर एक बाबा जी लाए हैं। ये हमारे साथ गोरखपुर छोड़ प्रदेश में सबको सरकार की सच्चाई बता रहे हैं। pic.twitter.com/GxlS0LYb6z
— Akhilesh Yadav (@yadavakhilesh) May 4, 2019