స్థానిక సంస్థల తొలివిడత ఎన్నికల్లో 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 67 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో జమయ్యాయి. రెండు ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. తొలివిడతలో రెండు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైంది. ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ తమ ఖాతాలో వేసుకుంది.