AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఇదేం మాస్ మావ.. టీ తాగడానికి ఏకంగా ట్రైన్ ఆపాడు.. రాఖీ బాయ్ ఫాలోవర్ అనుకుంట!

ఇప్పటి వరకు ఫోర్ వీలర్స్ లేదా టూ వీలర్స్ పై వెళ్లే వారికి టీ తాగాలని అనిపించినప్పుడు తమ వాహనాలను రోడ్డు పక్కన పెట్టుకుని తాగడం.. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు. కానీ శివునిలో జరిగిన విచిత్రం ఒకటి తెరపైకి వచ్చింది.

Viral Photo: ఇదేం మాస్ మావ.. టీ తాగడానికి ఏకంగా ట్రైన్ ఆపాడు.. రాఖీ బాయ్ ఫాలోవర్ అనుకుంట!
Train Driver
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 23, 2022 | 1:11 PM

Train Driver Viral Photo: టీ ప్రియులకు సంబంధించి ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఫోర్ వీలర్స్ లేదా టూ వీలర్స్ పై వెళ్లే వారికి టీ తాగాలని అనిపించినప్పుడు తమ వాహనాలను రోడ్డు పక్కన పెట్టుకుని తాగడం.. ఇప్పటివరకు మీరు చూసే ఉంటారు. కానీ శివునిలో జరిగిన విచిత్రం ఒకటి తెరపైకి వచ్చింది. టీ తాగేందుకు వందలాది మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును ఆపి టీ తీసుకోవడం అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ సంఘటన బీహార్ రాష్ట్రం శివన్ జిల్లాలోని సిస్వాన్ ధాలాలో చోటుచేసుకుంది. కాగా, ఈ సమయంలో రైలు ఆగిందా లేదా అనే దానిపై విచారణ జరుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.

ఇది శుక్రవారం ఉదయం బీహార్ రాష్ట్రంలో జరిగినట్లుగా చెబుతున్నారు. రైలు నంబర్ 11123 డౌన్ ఝాన్సీ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ టీ తాగడం కోసం 91A సిస్వాన్ ధాలా వద్ద రైలును ఆపాడు. రైలు కాపలాదారు ధాలా సమీపంలో ఉన్న దుకాణం నుండి టీ తెచ్చి, ఆపై ఇంజిన్ ఎక్కి డ్రైవర్‌కు అందించాడు. ఇందుకు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే, రోడ్డుకు ఇరువైపులా గేటు మూసి ఉండటం గమనార్హం. ఈ సమయంలో పదుల సంఖ్యలో జనం వాహనాలతో సహా వేచి ఉండటం విశేషం.

ఇదిలావుంటే, ఝాన్సీ అంటే గ్వాలియర్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:27 గంటలకు సివాన్ స్టేషన్‌కు చేరుకుంది. ఇంతలో రైలులోని గార్డు టీ కోసం రైలు దిగి సిస్వాన్ ధాలాలో ఉన్న టీ దుకాణానికి వచ్చాడు. అప్పటికి రైలు బయల్దేరే సమయం. రైలు ఉదయం 5:30 గంటలకు సివాన్ స్టేషన్ నుండి తెరిచి ఉంది. గార్డు ధాలా వద్ద ఉన్నాడని అప్పటికే డ్రైవర్‌కు తెలుసు. అందుకే అతను స్లో స్పీడ్‌లో రైలును ధలా వద్దకు తీసుకువచ్చి రైలును ఆపాడు.

గార్డు రెండు చేతులలో టీ కప్పుతో రైలు ఇంజిన్ వద్దకు వెళ్లి, మొదట డ్రైవర్‌కు టీ ఇచ్చాడు. దీని తరువాత, అతను స్వయంగా ఇంజిన్‌లో ప్రయాణించాడు. ఈ విషయమై స్టేషన్ సూపరింటెండెంట్ అనంత్ కుమార్ విరవరణ కోరగా.. అలాంటి ఫోటో తన దృష్టికి వచ్చిందని చెప్పారు. ఫొటోను అధికారులకు పంపించామన్నారు. ఇందుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Read Also… 

Higher Education: ఇకపై ఆ డిగ్రీలు చెల్లవు.. షాకింగ్ న్యూస్ చెప్పిన యూజీసీ, ఏఐసీటీఈ..!

Indian Railways: అనివార్య కారణంతో రైలు ఒక్క నిమిషం ఆగితే ఎంత నష్టమో తెలుసా? 

మరిన్ని వైరల్ న్యూస్ కోసం