- Telugu News Photo Gallery Vande Bharat Express From Tirupati To Secunderabad May Starts From April 8th
Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఛాన్స్!
శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ ట్రైన్ ప్రారంభించనున్నారని..
Updated on: Mar 25, 2023 | 9:19 PM


ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. అంతేకాకుండా.. ఈ రెండు నగరాలను కనెక్ట్ చేసేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉండగా.. మొదటిగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్లే రూట్లోనే వందేభారత్ను నడపనున్నారట.

అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.

ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది.

కాగా, వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.





























