Telugu News » Photo gallery » Vande Bharat Express From Tirupati To Secunderabad May Starts From April 8th
Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి వందేభారత్ రైలు.. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే ఛాన్స్!
Ravi Kiran |
Updated on: Mar 25, 2023 | 9:19 PM
శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ ట్రైన్ ప్రారంభించనున్నారని..
Mar 25, 2023 | 9:19 PM
1 / 5
ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. అంతేకాకుండా.. ఈ రెండు నగరాలను కనెక్ట్ చేసేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉండగా.. మొదటిగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్లే రూట్లోనే వందేభారత్ను నడపనున్నారట.
2 / 5
అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
3 / 5
ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది.
4 / 5
కాగా, వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైమాట.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.