AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Metro Routes: హైదరాబాద్‌ మెట్రో కొత్త రూట్స్‌ ఇవే.. నగరంలో అన్ని ప్రాంతాలను కలుపుతూ..

నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరుగాలని, దీనికి ప్రతిపాదనలు తయారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై ముఖ్యమంత్రి శ్రీ రెవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఎక్కువ ప్రయాణీకులకు ఉపయోగపడే విధంగా మెట్రోరైలు ప్రాజెక్టును తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. దీనికోసం హెచ్ఎండీఏ కమిషనర్ తో సమన్వయం చేసుకుంటూ కొత్త ప్రతిపాదనలు తయారుచేయాలని మెట్రోరైలు ఎండీనీ ఆదేశించారు..

Ashok Bheemanapalli
| Edited By: Narender Vaitla|

Updated on: Jan 03, 2024 | 9:50 AM

Share
దారుల్ షిఫా జంక్షన్ నుంచి షాలిబండ వరకు గల మెట్రోరైల్ స్ట్రెచ్ మార్గాన్ని  రోడ్డును  వెడల్పు చేయాలన్న హెచ్ఎంఆర్ఎల్ చేసిన  ప్రతిపాదనలపై పాతస్తీ ప్రజా ప్రతినిధులతో సంప్రదించి దారుల్ పిషా జంక్షన్ నుండి ఫలక్ నుమా జంక్షన్  వరకు రహాదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు  సీఎం సూచించారు.

దారుల్ షిఫా జంక్షన్ నుంచి షాలిబండ వరకు గల మెట్రోరైల్ స్ట్రెచ్ మార్గాన్ని రోడ్డును వెడల్పు చేయాలన్న హెచ్ఎంఆర్ఎల్ చేసిన ప్రతిపాదనలపై పాతస్తీ ప్రజా ప్రతినిధులతో సంప్రదించి దారుల్ పిషా జంక్షన్ నుండి ఫలక్ నుమా జంక్షన్ వరకు రహాదారిని 100 ఫీట్ల వరకు విస్తరించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు.

1 / 6
ఈ మార్గాలకు సంబంధించిన ప్రణాళికలు  త్వరగా సిద్ధం చేసి  సెంట్రల్ అర్బన్ డెవలప్ మెంట్  అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దిప్ సింగ్  పూరికి  డ్రాఫ్టు లెటర్‌ను  సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్  అడ్మినిస్ట్రేషన్ అండ్  అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 40 కిలోమేటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి  నుంచి నార్సంగి వయా నాగోల్ , వయా ఎంజీబీఎస్  చేపట్టాలని  కోరారు.

ఈ మార్గాలకు సంబంధించిన ప్రణాళికలు త్వరగా సిద్ధం చేసి సెంట్రల్ అర్బన్ డెవలప్ మెంట్ అండ్ హౌసింగ్ మినిస్టర్ హర్దిప్ సింగ్ పూరికి డ్రాఫ్టు లెటర్‌ను సిద్ధం చేసి పంపించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ ముఖ్య కార్యదర్శితో పాటు మెట్రోరైలు ఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 40 కిలోమేటర్ల మేర మూసి రివర్ ఫ్రంట్ ఈస్ట్-వెస్ట్ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సంగి వయా నాగోల్ , వయా ఎంజీబీఎస్ చేపట్టాలని కోరారు.

2 / 6
ఇక కొత్త మెట్రో రూట్స్‌ విషయానికొస్తే.. మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్ చెరు(14 కిలోమీటర్లు), ఎంజీబీఎస్-ఫలక్ నుమా-చాంద్రాయణగుట్ట-మైలాదేవర్ పల్లి-పీ7 రోడ్డు-ఏయిర్ పోర్టు(23 కిలోమీటర్లు),  నాగోల్-ఎల్బీనగర్—ఓవైసీ హాస్పటల్-చాంద్రాయణ గుట్ల-మైలాదేవర్ పల్లి-ఆరాంఘర్-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్(19 కిలోమీటర్లు), కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుండి/అమెరికన్ కాన్సూలేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు(12 కిలోమీటర్లు), ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్ నగర్(8 కిలోమీటర్లు)గా ఉంది.

ఇక కొత్త మెట్రో రూట్స్‌ విషయానికొస్తే.. మియాపూర్-చందానగర్-బీహెచ్ఈఎల్-పటాన్ చెరు(14 కిలోమీటర్లు), ఎంజీబీఎస్-ఫలక్ నుమా-చాంద్రాయణగుట్ట-మైలాదేవర్ పల్లి-పీ7 రోడ్డు-ఏయిర్ పోర్టు(23 కిలోమీటర్లు), నాగోల్-ఎల్బీనగర్—ఓవైసీ హాస్పటల్-చాంద్రాయణ గుట్ల-మైలాదేవర్ పల్లి-ఆరాంఘర్-న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్(19 కిలోమీటర్లు), కారిడార్ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు (విప్రో జంక్షన్ నుండి/అమెరికన్ కాన్సూలేట్) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్ ఐటీ జంక్షన్, ఐఎస్ బీ రోడ్డు(12 కిలోమీటర్లు), ఎల్బీనగర్-వనస్థలిపురం-హయత్ నగర్(8 కిలోమీటర్లు)గా ఉంది.

3 / 6
ఏయిర్ పోర్టు మెట్రోకు సంబంధించి  మార్చిన అలైన్ మెంట్ ప్రకారం వయా ఓల్డ్ సిటీ , ఎల్బీనగర్ కు సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనం చేయడంతోపాటు డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలని హెచ్ ఎంఆర్ ఎల్ ఎండీకి సీఎం సూచించారు. లక్ష్మిగూడ-జల్ పల్లి –మామిడిపల్లి మార్గంలో  కొత్తగా మెట్రో నిర్మాణం కోసం అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో  నిర్మాణం చేసే ప్రణాళికను పరిశీలించాలని సూచించారు.

ఏయిర్ పోర్టు మెట్రోకు సంబంధించి మార్చిన అలైన్ మెంట్ ప్రకారం వయా ఓల్డ్ సిటీ , ఎల్బీనగర్ కు సంబంధించిన ట్రాఫిక్ అధ్యయనం చేయడంతోపాటు డీపీఆర్ త్వరగా సిద్ధం చేయాలని హెచ్ ఎంఆర్ ఎల్ ఎండీకి సీఎం సూచించారు. లక్ష్మిగూడ-జల్ పల్లి –మామిడిపల్లి మార్గంలో కొత్తగా మెట్రో నిర్మాణం కోసం అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా రోడ్డు మధ్యలో 40 ఫీట్ల వెడల్పుతో నిర్మాణం చేసే ప్రణాళికను పరిశీలించాలని సూచించారు.

4 / 6
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు రూ.6,250 కోట్లతో నిర్మించతలపెట్టిన 31 కిలోమీటర్ల  ఏయిర్ పోర్టు మెట్రో ప్లాన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పైన అవుటర్ రింగ్ రోడ్డు  ఉందని అన్నారు. దీనికి బదులుగా ఏయిర్ పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్  వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని అన్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టు వరకు రూ.6,250 కోట్లతో నిర్మించతలపెట్టిన 31 కిలోమీటర్ల ఏయిర్ పోర్టు మెట్రో ప్లాన్ ను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరారు. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పైన అవుటర్ రింగ్ రోడ్డు ఉందని అన్నారు. దీనికి బదులుగా ఏయిర్ పోర్టుకు మెట్రోను ఎంజీబీఎస్ వయా ఓల్డ్ సిటీ తోపాటు ఎల్బీనగర్ నుంచి కూడా కనెక్ట్ చేయాలని అన్నారు.

5 / 6
వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని , ఓఆర్ఆర్ చుట్టు చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఏయిర్ పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను కేటాయించారని, మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామిర్‌పేట వరకు, కండ్లకోయ/మేడ్చల్  వరకు మెట్రోరైలు మూడవ దశ విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని , ఓఆర్ఆర్ చుట్టు చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఏయిర్ పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మాసిటీ కోసం భూములను కేటాయించారని, మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామిర్‌పేట వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడవ దశ విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.

6 / 6