AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Farming: ఈ పంట సాగుపై 50 శాతం సబ్సిడీ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రైతుల కోసం పలు రాష్ట్రాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి. కొన్ని పంటల సాగుకు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకుంటే పంట సాగు కోసం అందించే రుణాలలో సబ్సిడీ అందిస్తున్నాయి..

Subhash Goud
|

Updated on: Jun 29, 2023 | 8:11 PM

Share
బీహార్‌లోని రైతులు మామిడి, జామ, లిచి, పచ్చి కూరగాయలను పండించడమే కాకుండా తేయాకు కూడా పండిస్తారు. అరారియా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున తేయాకు సాగు చేస్తున్నారు. తేయాకు సాగు చేసే రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటం విశేషం.

బీహార్‌లోని రైతులు మామిడి, జామ, లిచి, పచ్చి కూరగాయలను పండించడమే కాకుండా తేయాకు కూడా పండిస్తారు. అరారియా, కిషన్‌గంజ్, కతిహార్, పూర్నియా జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున తేయాకు సాగు చేస్తున్నారు. తేయాకు సాగు చేసే రైతులను ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుండటం విశేషం.

1 / 5
ఇప్పుడు తేయాకు సాగు చేసే రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తేయాకు సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ సబ్సిడీని ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను కూడా నిర్ణయించింది.

ఇప్పుడు తేయాకు సాగు చేసే రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కీలక ప్రకటన చేశారు. తేయాకు సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ సబ్సిడీని ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ ధరను కూడా నిర్ణయించింది.

2 / 5
బీహార్ ప్రభుత్వం ప్రత్యేక శాస్త్రీయ పంట పథకం కింద తేయాకు విస్తీర్ణాన్ని విస్తరించేందుకు ఈ రాయితీని ప్రకటించినట్లు చెబుతున్నారు. రైతు సోదరులు ఒక హెక్టారులో తేయాకు సాగు చేస్తే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.

బీహార్ ప్రభుత్వం ప్రత్యేక శాస్త్రీయ పంట పథకం కింద తేయాకు విస్తీర్ణాన్ని విస్తరించేందుకు ఈ రాయితీని ప్రకటించినట్లు చెబుతున్నారు. రైతు సోదరులు ఒక హెక్టారులో తేయాకు సాగు చేస్తే వారికి 50 శాతం సబ్సిడీ ఇస్తారు.

3 / 5
సబ్సిడీ ఇవ్వడం వల్ల తేయాకు సాగు పట్ల రైతులకు ఆసక్తి పెరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టరేట్ అభిప్రాయపడింది. విశేషమేమిటంటే తేయాకు సాగుకు హెక్టారుకు యూనిట్ ధర రూ.494000గా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపైన రైతులకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.

సబ్సిడీ ఇవ్వడం వల్ల తేయాకు సాగు పట్ల రైతులకు ఆసక్తి పెరుగుతుందని ఉద్యానశాఖ డైరెక్టరేట్ అభిప్రాయపడింది. విశేషమేమిటంటే తేయాకు సాగుకు హెక్టారుకు యూనిట్ ధర రూ.494000గా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. దీనిపైన రైతులకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది.

4 / 5
సబ్సిడీ మంజూరు చేసిన తర్వాత రైతులకు రూ.247000 ఉచితంగా లభిస్తుంది. కతిహార్, కిషన్‌గంజ్, పూర్నియా, అరారియా రైతులు మాత్రమే సబ్సిడీని పొందుతారు.

సబ్సిడీ మంజూరు చేసిన తర్వాత రైతులకు రూ.247000 ఉచితంగా లభిస్తుంది. కతిహార్, కిషన్‌గంజ్, పూర్నియా, అరారియా రైతులు మాత్రమే సబ్సిడీని పొందుతారు.

5 / 5
Follow Us
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
సింగర్ ప్రభ గురించి ఈ విషయాలు మీకు తెలుసా.?
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!