
బేకింగ్ సోడా కలిపిన నీటిలో పండ్లు, కూరగాయలను 10-15 నిమిషాలు నానబెట్టడం వల్ల పురుగుమందుల పొరలు విచ్ఛిన్నం కావడానికి సహాయపడుతుందని వివిధ ఆహార అధ్యయనాలు చూపిస్తున్నాయి. ద్రాక్షను గెల నుంచి వేరు చేసి వాటిని 2-3 సార్లు శుభ్రమైన నీటిలో కడగాలి. ఇలా చేయడం వల్ల ఖాళీలలో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. కడిగిన తర్వాత శుభ్రమైన గుడ్డ లేదా టిష్యూ పేపర్తో తుడవడం వల్ల అదనపు తేమ తొలగిపోతుంది.

పరిశోధకులు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న కొందరిని సర్వే చేయగా అందులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయంట. ముఖ్యంగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా 40 ద్రాక్షలు తినే వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడమే కాకుండా, గట్ బ్యాక్టీరియా కూడా మెరుగు పడిందని వారు తెలిపారు.

నిర్లక్ష్యంగా అలాగే తినేస్తే ఈ రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తే అవి అలెర్జీలు, కడుపు నొప్పులు, తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ద్రాక్షను పూర్తిగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం.

చెడు కొలెస్ట్రాల్ను తగ్గించమే కాకుండా ప్రయోజనకరమైన గట్ బ్యాక్టీరియాకు ఇవి దోహద పడుతున్నాయంట. ప్రతి రోజూ ద్రాక్ష పండ్లు తినడం వలన ఇవి గట్ బ్యాక్టీరియాను మెరుగు పరిచి, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఇవి మలబద్ధకం, గ్యాస్ , ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయంట.

ద్రాక్షను సరిగ్గా కడిగే పద్ధతి ఒకటి ఉంది. అందుకు ఏం చేయాలంటే.. నీటితో ద్రాక్షను ఉప్పు నీటిలో 15 నుండి 20 నిమిషాలు నీటిలో నానబెట్టి, ఆ తర్వాత సాధారణ నీటితో మళ్ళీ సరిగ్గా కడగాలి. ఇలా చేయడం వల్ల ఉప్పు నీటిలోని బ్యాక్టీరియా సూక్ష్మక్రిములను చంపడానికి సహాయపడుతుంది. రసాయనాలను కూడా పూర్తిగా వదలగొడుతుంది.