
ఈ సారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన రియాన్ పరాగ్, సంజు శాంసన్ ఇద్దరూ స్లో ఓవర్ రేటు కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. అలాగే 5 టీమ్స్ నుంచి మొత్తం ఆరుగురు కెప్టెన్లపై జరిమానా విధించారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

అక్షర్ పటేల్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణీత సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువల్ల, వారికి నెలకు రూ. 12 లక్షల జరిమానా విధించారు.

హార్దిక్ పాండ్యా: మార్చి 30న గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్కు నాయకత్వం వహించిన హార్దిక్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించారు. అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో పాండ్యా స్లో ఓవర్ వేసినందుకు జరిమానా పడింది.

రియాన్ పరాగ్: రాజస్థాన్ రాయల్స్ను 3 మ్యాచ్ల్లో నడిపించిన రియాన్ పరాగ్కు కూడా జరిమానా విధించారు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ తప్పు చేసినందుకు పరాగ్కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

రిషభ్ పంత్: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు కూడా జరిమానా విధించారు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పంత్ నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయకపోవడంతో అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు.

రజత్ పాటిదార్: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువల్ల ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ రూ.12 లక్షల జరిమానా విధించారు.

సంజు శాంసన్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ కూడా నిర్ణీత సమయంలోపు 20 ఓవర్లు పూర్తి చేయలేదు. అందువలన, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ కు రూ. 24 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్ కంటే ముందు పరాగ్ కెప్టెన్సీలో ఆర్ఆర్ ఒకసారి స్లో ఓవర్ రేట్ నమోదుచేయడంతో.. రెండో సారి చేసిన తప్పుకు డబుల్ జరిమానా విధించారు.