AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramateertham: ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత ఆనవాళ్లు.. రామతీర్థం చరిత్ర తెలుసా?

రామతీర్థం భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలోని గ్రామ పంచాయతీ. ఇది విజయనగరం నగరానికి 12 కి.మీ. భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ  రామాలయం ప్రదేశాలలో రామతీర్థం ఒకటి. ఈ క్షేత్రంలో రామాయణ, మహా భారత ఆనవాళ్లు ఉన్నాయి. మరి అవేంటి.? ఈ క్షేత్ర చరిత్ర ఏంటి.? ఈరోజు మనం చూద్దాం..

Prudvi Battula
|

Updated on: Jun 03, 2025 | 11:53 AM

Share
విజయనగరం జిల్లాలోని రామతీర్ధం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు దీనికి పక్కనే ఉన్న బోదికొండను కూడా సందర్శించవచ్చు. 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు. 

విజయనగరం జిల్లాలోని రామతీర్ధం సీతారాముల ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఆలయాన్ని ఏటా వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు దీనికి పక్కనే ఉన్న బోదికొండను కూడా సందర్శించవచ్చు. 16వ శతాబ్దంలో విజయనగర మహారాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. దేవాలయ నిర్మాణం కూడా ఈ కాలంలో జరిగిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, శనివారాలలో అనేక మంది భక్తులు సందర్శిస్తారు. 

1 / 6
రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ, దాని అద్భుతమైన లక్షణాలు, చరిత్రతో ప్రత్యేకమైనది. ఈ కొండ, పురాణాలలోని పాత్రలతో, చారిత్రక సంఘటనలతో అనుసంధానమై, అనేక రహస్యాలను దాచుకుంది. బోదికొండకి చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉంది.

రామతీర్ధం పుణ్యక్షేత్రం సమీపంలో ఉన్న బోదికొండ, దాని అద్భుతమైన లక్షణాలు, చరిత్రతో ప్రత్యేకమైనది. ఈ కొండ, పురాణాలలోని పాత్రలతో, చారిత్రక సంఘటనలతో అనుసంధానమై, అనేక రహస్యాలను దాచుకుంది. బోదికొండకి చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉంది.

2 / 6
బోదికొండ, ఒక ఏకశిల. అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ. ఈ కొండపై రాములవారి దేవాలయం నిర్మించబడింది. స్థలపురాణం ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు, ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలందుకుంటున్నాయి. ఈ కొండపై ఉన్న ఒక కొలను, దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైనది. ఇక్కడ వేసిన నాణేలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం ఉంది. ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎండిపోదు.

బోదికొండ, ఒక ఏకశిల. అంటే ఇది ఒకే రాతిపై ఏర్పడిన కొండ. ఈ కొండపై రాములవారి దేవాలయం నిర్మించబడింది. స్థలపురాణం ప్రకారం, పాండవులు తమ అరణ్యవాస సమయంలో ఈ కొండపై నివసించారు. శ్రీకృష్ణుడు పాండవులకు ఇచ్చిన దేవతామూర్తులు, ఇప్పటికీ ఈ దేవాలయంలో పూజలందుకుంటున్నాయి. ఈ కొండపై ఉన్న ఒక కొలను, దాని విశేషమైన లక్షణాలకు ప్రత్యేకమైనది. ఇక్కడ వేసిన నాణేలు లేదా వస్తువులు కాశీలో తేలుతాయని ఒక నమ్మకం ఉంది. ఈ కొలనులో నీరు ఎప్పుడూ ఎండిపోదు.

3 / 6
భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోదికొండపై ఉంది. ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లుగా చెబుతారు. ఈ ప్రదేశం  నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరుకైన మార్గాలు, అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.

భీముడి గృహం అని పిలువబడే ప్రదేశం కూడా బోదికొండపై ఉంది. ఇక్కడ భీముడు తన బలంతో పడిపోతున్న పర్వతాన్ని తన తలతో ఆపినట్లుగా చెబుతారు. ఈ ప్రదేశం  నిర్మాణం చాలా సంక్లిష్టంగా ఉంది. ఇరుకైన మార్గాలు, అడ్డంగా తిరగాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.

4 / 6
సీతమ్మవారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి. సీతమ్మవారు లవకుశులను ఇక్కడ ఆడించినట్లుగా చెబుతారు. కొండ కింద, సీతమ్మవారి పురుటి మంచానికి సంబంధించినట్లు చెప్పబడే ప్రదేశం ఉంది. రాళ్ళ నుండి ఇంగువ వాసన వస్తుందని కూడా చెబుతారు.

సీతమ్మవారి వనవాసానికి సంబంధించిన కథనాలు కూడా ఈ కొండతో అనుసంధానమై ఉన్నాయి. సీతమ్మవారు లవకుశులను ఇక్కడ ఆడించినట్లుగా చెబుతారు. కొండ కింద, సీతమ్మవారి పురుటి మంచానికి సంబంధించినట్లు చెప్పబడే ప్రదేశం ఉంది. రాళ్ళ నుండి ఇంగువ వాసన వస్తుందని కూడా చెబుతారు.

5 / 6
ఇవి మాత్రమే కాదు.. ఈ కొండపై జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై మీరు బౌద్ధారామం, అలాగే శిధిల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు, ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బోదికొండను కూడా సందర్శించండి.

ఇవి మాత్రమే కాదు.. ఈ కొండపై జైన, బౌద్ధ ఆనవాళ్లు కూడా ఉన్నాయి. దీనిపై మీరు బౌద్ధారామం, అలాగే శిధిల జైన్ టెంపుల్ కూడా ఇక్కడ చూడవచ్చు. రామతీర్ధం ఆలయాన్ని సందర్శించేవారు, ఈ చారిత్రక పురాణ ప్రాముఖ్యత కలిగిన బోదికొండను కూడా సందర్శించండి.

6 / 6
Follow Us
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం