- Telugu News Photo Gallery Spiritual photos IRCTC introduces Bharat Darshan 2025 Jyotirlinga Tour for budget travellers
Jyotirlinga Tour: జ్యోతిర్లింగ టూర్కి ఇది పర్ఫెక్ట్ ప్యాకేజీ.. తక్కువ ఖర్చుతో చుట్టి రావచ్చు..
భారతదేశంలోని పవిత్ర స్థలాలను దర్శించుకోవడానికి ఏటా చాలామంది వెళ్తుంటారు. తాజాగా IRCTC ప్రత్యేకమైన ప్యాకేజీని ఆవిష్కరించింది. ఇది భారతదేశం అంతటా ఆధ్యాత్మిక ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. దీని ద్వారా సాధారణ ప్రయాణ గందరగోళం లేదా భారీ ఖర్చులు లేకుండా దేశవ్యాప్తంగా అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలను సందర్శించే అవకాశం కల్పిస్తుంది. మహాకల్, షిర్డీలతో సహా భారత్ దర్శన్ 2025 జ్యోతిర్లింగ టూర్ను పరిచయం చేసింది రైల్వే.
Updated on: Jun 24, 2025 | 11:57 AM

భారత్ దర్శన్ 2025 ప్యాకేజీ ద్వారా IRCTC భారతదేశం అంతటా బడ్జెట్-ఫ్రెండ్లీ తీర్థయాత్ర పర్యటనలను అందిస్తుంది. జ్యోతిర్లింగ శివాలయాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇందులో ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్, షిర్డీ సాయి బాబా ఆలయం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కవర్ అవుతాయి.

భారత దర్శన్ జ్యోతిర్లింగ పర్యటన ఎంచుకున్న మార్గాన్ని బట్టి 8 నుండి 10 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ పర్యటన ఢిల్లీ, వారణాసి, లక్నో, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్తో సహా బహుళ రాష్ట్రాలను కవర్ చేస్తుంది. కాబట్టి బుకింగ్ సమయంలో బయలుదేరే మీకు బోర్డింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి.

ఈ ప్యాకేజీలో ప్రధానంగా సోమనాథ్, శ్రీశైలం మల్లికార్జున, ఉజ్జయిని మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్ ఓంకారేశ్వర్, బైద్యనాథ్, గుజరాత్ నాగేశ్వర్, కేదారేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్, రామేశ్వర్, మహారాష్ట్ర భీమేశ్వర్, కాశి విశ్వేశ్వర్, ఔరంగాబాద్ గృష్ణేశ్వర్ అనే 12 జ్యోతిర్లింగాలతో పాటు షిర్డీ సాయి బాబా మరికొన్ని దేవాలయాలను దర్శించుకోవచ్చు.

IRCTC జ్యోతిర్లింగ టూర్ 2025 చాలా బడ్జెట్-ఫ్రెండ్లీగా ఉంది. పూర్తి ట్రిప్కు ఒక్కొక్కరికి దాదాపు రూ. 10500 నుంచి రూ. 12000 వరకు ధరలు ఉంటాయి. ఇందులో స్లీపర్ క్లాస్ రైలు ప్రయాణం, పర్యటన సమయంలో శాఖాహార భోజనం, నాన్ ఏసీ వసతి గృహాలు లేదా హాళ్లలో వసతి, స్థలాలకు చేరుకోవడానికి బస్సు చార్జాలు, టూర్ ఎస్కార్ట్లు, భద్రత, ప్రయాణ బీమా, లభిస్తాయి.

బుకింగ్ సులభంగ అధికారిక IRCTC టూరిజం వెబ్సైట్ ద్వారా చేయవచ్చు. www.irctctourism.com ని సందర్శించండి. భారత్ దర్శన్ ప్యాకేజీలకు నావిగేట్ చేయండి. జ్యోతిర్లింగ టూర్ 2025ని ఎంచుకోండి. మీ బోర్డింగ్ స్టేషన్ను ఎంచుకోండి. ప్రయాణికుల వివరాలను పూరించండి. ఆన్లైన్లో చెల్లింపు చేయండి. బుకింగ్ను అధీకృత IRCTC ఏజెంట్లు లేదా ప్రాంతీయ పర్యాటక కార్యాలయాల ద్వారా కూడా చేయవచ్చు.




