PM Modi: ఎన్డీయే కూటమి అగ్రనేతలో ప్రధాని మోడీ భేటీ.. ఆ అంశాలపై చర్చ!

మహారాష్ట్రలో తగ్గిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ రైతాంగంలో పెరిగిన అసంతృప్తి, పార్టీల్లో చీలికల తర్వాత ఉద్ధవ్‌-శరద్‌ పవార్‌లపై ఏర్పడ్డ సానుభూతి..ఇవన్నీ ఎన్‌డీఏ కూటమికి ఇప్పదిగా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది ఎన్డీఏ కూటమి..

|

Updated on: Oct 17, 2024 | 9:56 PM

వందరోజుల పాలనలో సాధించిన విజయాలు.. వచ్చే నాలుగున్నరేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు ఎన్డీఏ నేతలు. 2047 అమృత్‌కాల్‌ విజన్‌తో పాటు జాతీయ అభివృద్ధి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్ అలాగే ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ హత్య దినంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. హర్యానాలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన నేపథ్యంలో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతల మధ్య చర్చ జరిగింది.

వందరోజుల పాలనలో సాధించిన విజయాలు.. వచ్చే నాలుగున్నరేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాలపై సుదీర్ఘంగా చర్చించారు ఎన్డీఏ నేతలు. 2047 అమృత్‌కాల్‌ విజన్‌తో పాటు జాతీయ అభివృద్ధి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. సంవిధాన్ కా అమృత్ మహోత్సవ్ అలాగే ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రాజ్యాంగ హత్య దినంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. హర్యానాలో హ్యాట్రిక్‌ విజయం సాధించిన నేపథ్యంలో త్వరలో జరగనున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతల మధ్య చర్చ జరిగింది.

1 / 5
హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎన్డీఏ పార్టీల నేతలు..కార్యక్రమం అనంతరం చండీగఢ్‌లో జరిగిన కూటమి భేటీలో పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు మూడోసారి కొలువు దీరిన తర్వాత కూటమి నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చాక ఢిల్లీలో ఒకసారి సమావేశమైనా.. అది లాంఛనప్రాయమే. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఎన్డీఏ పార్టీల నేతలు..కార్యక్రమం అనంతరం చండీగఢ్‌లో జరిగిన కూటమి భేటీలో పాల్గొన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ సర్కారు మూడోసారి కొలువు దీరిన తర్వాత కూటమి నేతలు భేటీ కావడం ఇదే మొదటిసారి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలొచ్చాక ఢిల్లీలో ఒకసారి సమావేశమైనా.. అది లాంఛనప్రాయమే. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

2 / 5
హర్యానా ఇచ్చిన ఊపును కొనసాగించాలన్న వ్యూహాన్ని కూడా అక్కడి నుంచే అమలు చేయాలన్నది ఎన్‌డీఏ ప్రణాళిక. అందుకే.. ప్రమాణస్వీకారం తర్వాత పంచకులలో ఎన్‌డీఏ కీలక సమావేశం జరిగింది. NDAలోని మొత్తం 31 పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.

హర్యానా ఇచ్చిన ఊపును కొనసాగించాలన్న వ్యూహాన్ని కూడా అక్కడి నుంచే అమలు చేయాలన్నది ఎన్‌డీఏ ప్రణాళిక. అందుకే.. ప్రమాణస్వీకారం తర్వాత పంచకులలో ఎన్‌డీఏ కీలక సమావేశం జరిగింది. NDAలోని మొత్తం 31 పార్టీల నేతలు సమావేశానికి హాజరయ్యారు.

3 / 5
మహారాష్ట్ర ఎన్నికల రూపంలో మోదీ 3.0కు అతిపెద్ద సవాల్‌ ఎదురయింది. మహారాష్ట్ర ఒకప్పుడు రెండు శిబిరాలకు మాత్రమే రాజకీయ రణక్షేత్రం పరిమితమయ్యేది. ఓవైపు బీజేపీ-శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీలు తలపడేవి. అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ మారింది. సీఎం పదవి కోసం బీజేపీ హ్యాండిచ్చి.. కాంగ్రెస్‌ కూటమిలో చేరింది శివసేన. ఆ విధంగా ఏర్పడిందే మహా వికాస్‌ అఘాడీ. తర్వాత ఏక్‌నాథ్‌ షిండే రూపంలో శివసేనలో పుట్టిన ముసలం.. బీజేపీకి ఊతమిచ్చింది. తర్వాత ఎన్‌సీపీలో కూడా చీలికలొచ్చి మహా పాలిటిక్స్‌ని మరింత రసవత్తరంగా మార్చేశాయి. కూటమి వర్సస్‌ కూటమిగా మారిన మహారాష్ట్రలో పాగా వేయడం ఎన్డీఏ ముందున్న అతిపెద్ద సవాలు

మహారాష్ట్ర ఎన్నికల రూపంలో మోదీ 3.0కు అతిపెద్ద సవాల్‌ ఎదురయింది. మహారాష్ట్ర ఒకప్పుడు రెండు శిబిరాలకు మాత్రమే రాజకీయ రణక్షేత్రం పరిమితమయ్యేది. ఓవైపు బీజేపీ-శివసేన.. మరోవైపు కాంగ్రెస్-ఎన్సీపీలు తలపడేవి. అయితే 2019 ఎన్నికల తర్వాత సీన్ మారింది. సీఎం పదవి కోసం బీజేపీ హ్యాండిచ్చి.. కాంగ్రెస్‌ కూటమిలో చేరింది శివసేన. ఆ విధంగా ఏర్పడిందే మహా వికాస్‌ అఘాడీ. తర్వాత ఏక్‌నాథ్‌ షిండే రూపంలో శివసేనలో పుట్టిన ముసలం.. బీజేపీకి ఊతమిచ్చింది. తర్వాత ఎన్‌సీపీలో కూడా చీలికలొచ్చి మహా పాలిటిక్స్‌ని మరింత రసవత్తరంగా మార్చేశాయి. కూటమి వర్సస్‌ కూటమిగా మారిన మహారాష్ట్రలో పాగా వేయడం ఎన్డీఏ ముందున్న అతిపెద్ద సవాలు

4 / 5
మహారాష్ట్రలో తగ్గిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ రైతాంగంలో పెరిగిన అసంతృప్తి, పార్టీల్లో చీలికల తర్వాత ఉద్ధవ్‌-శరద్‌ పవార్‌లపై ఏర్పడ్డ సానుభూతి..ఇవన్నీ ఎన్‌డీఏ కూటమికి ఇప్పదిగా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది ఎన్డీఏ కూటమి. మహారాష్ట్రతో పాటే  ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడం కూడా బీజేపీకి ఛాలెంజ్‌గా మారింది. 2014 ఎన్నికల్లో 37 సీట్లను గెల్చుకున్న బీజేపీ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేఎంఎం ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి పంచ్‌ ప్రాణ్‌ పేరుతో వాగ్దానాలు చేసింది బీజేపీ. మరి పంచకుల వేదికగా జరిగిన ఎన్‌డీఏ నేతల భేటీ ఎంతవరకూ సక్సెస్‌ అయిందో తెలియాలంటే.. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

మహారాష్ట్రలో తగ్గిన ఉపాధి అవకాశాలు, గ్రామీణ రైతాంగంలో పెరిగిన అసంతృప్తి, పార్టీల్లో చీలికల తర్వాత ఉద్ధవ్‌-శరద్‌ పవార్‌లపై ఏర్పడ్డ సానుభూతి..ఇవన్నీ ఎన్‌డీఏ కూటమికి ఇప్పదిగా మారాయి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లే దక్కినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్ని తేలిగ్గా తీసుకోవద్దని భావిస్తోంది ఎన్డీఏ కూటమి. మహారాష్ట్రతో పాటే ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో పోయిన అధికారాన్ని తిరిగి తెచ్చుకోవడం కూడా బీజేపీకి ఛాలెంజ్‌గా మారింది. 2014 ఎన్నికల్లో 37 సీట్లను గెల్చుకున్న బీజేపీ.. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేఎంఎం ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి పంచ్‌ ప్రాణ్‌ పేరుతో వాగ్దానాలు చేసింది బీజేపీ. మరి పంచకుల వేదికగా జరిగిన ఎన్‌డీఏ నేతల భేటీ ఎంతవరకూ సక్సెస్‌ అయిందో తెలియాలంటే.. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిందే.

5 / 5
Follow us