
జింకలు ఎక్కువగా అడవి ప్రాంతంలో జీవిస్తాయనే విషయం తెలిసిందే. జీంకల్లో వివిధ జాతులు ఉంటాయి. దాదాపు 30కి పైగా రకాల జింకలు ఈ భూమిపై ఉన్నాయి.

జింకలు ఎక్కువగా అడవి ప్రాంతంలో జీవిస్తాయనే విషయం తెలిసిందే. జీంకల్లో వివిధ జాతులు ఉంటాయి. దాదాపు 30కి పైగా రకాల జింకలు ఈ భూమిపై ఉన్నాయి.

తాజాగా మైసూర్ నాగర్హోళ్ అభయారణ్యంలో జింకలు సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జింకలు కామనే కదా అని అనుకుంటున్నారా? అయితే, ఇక్కడి మందలో ఒక ప్రత్యేకమైన జింక కనువిందు చేసింది. అందుకే ఈ ఫోటోలు ఇప్పుడ వైరల్గా మారాయి. మైసూర్ నాగర్హోళే అభయారణ్యంలో తెల్ల జింకలు కనిపించాయి.

మైసూర్లోని నాగర్హోళే అభయారణ్యంలో జింకల మంద సంచరిస్తుండగా.. ఆ మందలో ఓ తెల్ల జింక కూడా ఉండటాన్ని పర్యాటకులు గుర్తించారు. పర్యాటకులు వెంటనే తమ కెమెరాకు పని చెప్పారు. తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో తెల్ల జింకను ఫోటో తీశారు.

హెచ్డి కోటే తాలూకా పరిధిలోని తారక రిజర్వాయర్ బ్యాక్ వాటర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఈ తెల్ల జింక కనువిందు చేసింది. వన్యప్రాణుల పిగ్మెంటేషన్లో వ్యత్యాసం కారణంగా జింక రంగులో వైవిధ్యం ఉందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

మెలనిన్ అనేది జుట్టుకు రంగును ఇచ్చే రసాయనం. వర్ణద్రవ్యం కణాల ద్వారా ఉత్పత్తి అవుతుంది. శరీరంలో మెలనిన్ పెరిగితే, జంతువులు తెలుపు రంగుతో, తగ్గితే నలుపు రంగుతో పుడతాయట.