AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు.. లేదంటే కడుపులో నరకమే..

ప్రస్తుత సీజన్‌లో మార్కెట్లో నోరూరించే అల్ల నేరేడు పండ్లు విరివిగా లభిస్తాయి. తీపి, వగరు, పులుపుల కలయికతో ఉండే ఈ పండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఒక సంజీవని లాంటిది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా సహాయపడతాయి. అయితే కొన్ని ఆహార పదార్థాలతో కలిపి నేరేడు పండ్లను తింటే తీవ్రమైన కడుపు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Krishna S
|

Updated on: Jun 05, 2026 | 1:40 PM

Share
ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.

ఊరగాయలు అసలు వద్దు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో పాటు ఊరగాయలను అస్సలు ముట్టకూడదు. ఎందుకంటే ఊరగాయలు, నేరేడు పండ్లు రెండూ ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీనివల్ల గుండెల్లో మంట, తీవ్రమైన ఎసిడిటీ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఈ రెండింటికీ మధ్య కనీసం ఒక గంట వ్యవధి ఉండాలి.

1 / 5
పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, నేరేడు పండ్లతో దీని కాంబినేషన్ అస్సలు సెట్ కాదు. జామూన్ తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతమందిలో వికారం, కడుపులో తీవ్రమైన మంట, అసౌకర్యం కలగవచ్చు. ఈ రెండింటి రసాయన చర్యల వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

పసుపుతో ప్రమాదం: పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ, నేరేడు పండ్లతో దీని కాంబినేషన్ అస్సలు సెట్ కాదు. జామూన్ తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతమందిలో వికారం, కడుపులో తీవ్రమైన మంట, అసౌకర్యం కలగవచ్చు. ఈ రెండింటి రసాయన చర్యల వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.

2 / 5
పాలు తాగడం మానుకోండి: చాలా మంది పండ్లు తినగానే పాలు తాగుతుంటారు. కానీ నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ కాంబినేషన్ కడుపులో గ్యాస్, తీవ్రమైన కడుపు నొప్పి, ఉబ్బరానికి కారణమవుతుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 1 నుండి 2 గంటల వరకు పాలు గానీ, పాల పదార్థాలు గానీ తీసుకోకపోవడమే మంచిది.

పాలు తాగడం మానుకోండి: చాలా మంది పండ్లు తినగానే పాలు తాగుతుంటారు. కానీ నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ కాంబినేషన్ కడుపులో గ్యాస్, తీవ్రమైన కడుపు నొప్పి, ఉబ్బరానికి కారణమవుతుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 1 నుండి 2 గంటల వరకు పాలు గానీ, పాల పదార్థాలు గానీ తీసుకోకపోవడమే మంచిది.

3 / 5
స్వీట్లు, వేయించిన ఆహారాలు: నేరేడు పండ్లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. కానీ అధిక తీపి పదార్థాలు, నూనెలో వేయించిన ఫుడ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, శరీరం బరువుగా అనిపించడం వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి. స్వీట్లు తినాలనుకుంటే జామూన్ తిన్న రెండు గంటల తర్వాతే తినాలి.

స్వీట్లు, వేయించిన ఆహారాలు: నేరేడు పండ్లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. కానీ అధిక తీపి పదార్థాలు, నూనెలో వేయించిన ఫుడ్స్ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్, శరీరం బరువుగా అనిపించడం వంటి అసౌకర్యాలు తలెత్తుతాయి. స్వీట్లు తినాలనుకుంటే జామూన్ తిన్న రెండు గంటల తర్వాతే తినాలి.

4 / 5
తిన్న వెంటనే నీళ్లు తాగితే: నేరేడు పండ్లు తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల కడుపులోని జీర్ణరసాల వేగం మందగించి, తిన్న పండ్లు సరిగ్గా అరగవు. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం వస్తుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం. కాగా నేరేడు పండ్లను ఎప్పుడూ కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే మితంగా తిన్నప్పుడే ఈ సీజనల్ ఫ్రూట్ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

తిన్న వెంటనే నీళ్లు తాగితే: నేరేడు పండ్లు తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగడం చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల కడుపులోని జీర్ణరసాల వేగం మందగించి, తిన్న పండ్లు సరిగ్గా అరగవు. దీనివల్ల అజీర్ణం, ఎసిడిటీ, కడుపులో అసౌకర్యం వస్తుంది. నేరేడు పండ్లు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీళ్లు తాగకుండా ఉండటం ఉత్తమం. కాగా నేరేడు పండ్లను ఎప్పుడూ కూడా ఉదయం ఖాళీ కడుపుతో తినకూడదు. అలాగే మితంగా తిన్నప్పుడే ఈ సీజనల్ ఫ్రూట్ పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి అందుతాయి.

5 / 5
Follow Us
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
అల్లనేరేడు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
లక్ష్మీదేవి పూజలో పారిజాత పుష్పాల ప్రాముఖ్యత.. ఇంట్లో సిరుల పంట!
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
ఆసుపత్రిలో కలకలం.. గర్భిణి చనిపోయిన గంటల్లోనే 3 తులాల బంగారం మాయం
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
చైన్‌తో కట్టేసిన కుక్కకే దమ్కీ ఇద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే..
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
పుల్ల పుల్లగా కారంగా.. పిల్లలకు ఎంతో నచ్చే బొరుగుల గొట్టం మిక్చర్
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
కాలసర్ప దోషంతో ఆ రాశుల వారికి మహర్దశ! ఇక గోల్డెన్ టైమ్ మొదలైనట్టే
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఏపీలోనూ గోవా తరహా బీచ్ షాక్స్.
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
ఉచిత MMTS ప్రయాణానికి బ్రేక్!
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
అర్దరాత్రి ఫోన్ చేసి నా జాతకమే మార్చేశారు.. బ్రహ్మాజీ కామెంట్స్.
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే
స్నానం చేసే నీటిలో చిటికెడు కర్పూరం వేయండి..ఈ ప్రయోజనాలు తెలిస్తే