
ఆరోగ్యం క్షీణించినప్పుడు చాలా మంది తరచుగా వేడి నీటిని తాగుతాము. సాధారణంగా, బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీటిని తాగుతారు. వేడినీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభించవచ్చు, కానీ కొంతమంది దీనిని నివారించాలి. ఎందుకంటే ఇది వారిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.

జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగి వేడి నీటిని తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని తాగడం వల్ల వారి గొంతు వాపు, చికాకు పెరుగుతుందని.. వేడి నీరు వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుందని చెబుతున్నారు. ఒక వేళ మీరు వేడి నీటినే తాగాలి అనుకుంటే.. వాటిని వేడి చేసి కాసేపు చల్లార్చి కాస్తా గొరు వెచ్చగా ఉన్నప్పుడు తాగడం ఉత్తమం. ఇది వారి గొంతు ఎండిపోకుండా ఉండటానికి సహాయపడుతుంది.

ముఖ్యంగా చిన్నపిల్లలు జీర్ణవ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి వారికి పెద్దల మాదిరిగా వేడి నీటిని తాపడం అంత మంచింది కాదు. వేడి నీళ్లు తాగడం వల్ల వారి కడుపుకు హాని కలుగుతుంది. కాబట్టి వారికి ఎప్పుడూ వేడి నీటిని తాపకండి.. కావాలంటే కాచి చల్లార్చిన నీటిని తాపవచ్చు.

కాలేయ వ్యాధితో బాధపడేవారు కూడా వేడి నీటిని అస్సలు తాగకూడదు. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాలేయం చాలా సున్నితమైన అవయవం, రాబట్టి దానిలో ఏదైనా సమస్య ఏర్పడితే అది శరీరంలోని వివిధ విధులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

అలాగే సున్నితమైన చర్మం ఉన్నవారు కూడా వేడి నీటికి దూరంగా ఉండాలి. వీరు సాధారణ నీటిని మాత్రమే త్రాగాలి. ఎందుకంటే వేడి నీరు వారిపై ప్రతికూల ప్రభావాలను చూపించవచ్చు. కాబట్టి పై పేర్కొన్న వ్యాధిగ్రస్తులు, పలు సమస్యలు ఉన్నవారు వేడి నీటిని తాగే ముందు వైద్యులను సంప్రదించండం ఉత్తమం( గమనిక: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటీని వేము దృవీకరించట్లేదు)