AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నో చిప్స్.. నో కుర్కురే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఇది పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు

పిల్లల లంచ్ బాక్స్ అంటే ప్రతి అమ్మకు అది పెద్ద టాస్క్. చాలా మంది తల్లులు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఎలాంటి రిసిపీలు పెట్టాలో తెలియక తెగ టెన్షన్ పడుతుంటారు. కొన్ని సార్లు పెట్టినదే మళ్లీ పెట్టడం వలన పిల్లలు తినడానికి ఇష్టపడరు. అందుకే ఎప్పుడూ ఏదో ఒక కొత్త రకం రిసిపీ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతే కాకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రిసిపీస్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు మనం పిల్లలు ఇష్టంగా తినే అరటి పండు( బనానా రోస్ట్ ) ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Sep 16, 2026 | 1:52 PM

Share
కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  బాగా పండిన అరటి పండ్లు రెండు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పంచదార, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్స్ స్పూన్స్.

కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బాగా పండిన అరటి పండ్లు రెండు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పంచదార, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్స్ స్పూన్స్.

1 / 5
 తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. మనం సగానికి కట్ చేసిన వాటిని మళ్లీ నిలువుగా రెండుగా కట్ చేయాలి.

తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. మనం సగానికి కట్ చేసిన వాటిని మళ్లీ నిలువుగా రెండుగా కట్ చేయాలి.

2 / 5
ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి  తీసుకొని వేడి చేయాలి. తర్వాత అరటి ముక్కలను తీసుకోవాలి. వాటిని పాన్ పై ఒకదాని పక్కన మరొక పేర్చాలి. సన్ననిమంటపై దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని వేడి చేయాలి. తర్వాత అరటి ముక్కలను తీసుకోవాలి. వాటిని పాన్ పై ఒకదాని పక్కన మరొక పేర్చాలి. సన్ననిమంటపై దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి.

3 / 5
ఇప్పుడు ఆ అరటి పండ్లపై కొంచెం కొంచెం పంచదారను చల్లుతూ ఉండాలి. తర్వాత వీటిని మళ్లీ కలపాలి, తర్వాత మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. అరటి పండ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి.

ఇప్పుడు ఆ అరటి పండ్లపై కొంచెం కొంచెం పంచదారను చల్లుతూ ఉండాలి. తర్వాత వీటిని మళ్లీ కలపాలి, తర్వాత మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. అరటి పండ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి.

4 / 5
తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక వీటి వేడి తగ్గిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్‌లోకి వేయాలి. లేదా సర్వ్ చేయవచ్చును. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెడితే చాలు మళ్లీ మళ్లీ కావాలి అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి.

తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక వీటి వేడి తగ్గిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్‌లోకి వేయాలి. లేదా సర్వ్ చేయవచ్చును. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెడితే చాలు మళ్లీ మళ్లీ కావాలి అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి.

5 / 5
Follow Us