వర్షాకాలంలో ఒకసారి తడిచేస్తే చాలు వెంటనే జ్వరం వస్తుంది. ఈ సీజన్లో క్రిములు, వైరస్లు వేతంగా దాడి చేస్తాయి. దీంతో వర్షాకాలంలో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తలపై వర్షం నీళ్లు పడగానే తుమ్ములు, దగ్గు ప్రారంభమవుతుంది. రోజు ముగిసేలోపు జ్వరం కూడా మొదలవుతుంది. ఈ సీజన్లో ఇది సాధారణ సమస్యగా కనిపిస్తోంది.
జ్వరం వచ్చినప్పుడు నోటికి రుచి తెలియదు. శరీరం బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో మీరు ఎంత ఎక్కువ ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే అంత త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగరి ఏదిపడితే అది తింటే సమస్య ముదిరిపోవచ్చు. ముఖ్యంగా జ్వరం సమయంలో ఈ ఆహారాలకు దూరంగా ఉండా
జ్వరం వచ్చినప్పుడు రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది. అయితే మటన్ మాత్రం అస్సలు తినకూడదు. రెడ్ మీట్లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది శారీరక సమస్యలను పెంచుతుంది. అంతేకాకుండా మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం ఉండదు. జ్వరంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే పిజ్జా, పాస్తా తినడం మానుకోవాలి. ఇందులో చీజ్ ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.
జలుబు, జ్వరం ఉంటే శీతల పానీయాలు తాగడం మంచిది కాదు. ఇది సమస్య పెంచుతుంది. ఈ పానీయంలో ప్రిజర్వేటివ్స్, షుగర్ ఉంటాయి. శీతల పానీయాలకు బదులు కొబ్బరి నీళ్లు, ఓఆర్ ఎస్ వాటర్ తాగాలి. ఫలితంగా త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది.
బిర్యానీ వంటి ఫాస్ట్ ఫుడ్ ఫీవర్లో తినవద్దు. బయటి ఆహారంలో ఉప్పు, నూనె, పంచదార ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన ఆహారాలు కారంగా ఉంటాయి. అవి కడుపు సమస్యలను పెంచుతాయి. నయం కావడానికి సమయం ఎక్కువ పడుతుంది. అలాగే కోడి కూర, కోడిగుడ్డు కూర కూడా తినకూడదు. ఎంత తేలికైన అహారం తింటే అంత వేగంగా కోలుకోవచ్చు.