గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన కొండముచ్చు.. తర్వాత జరిగింది చూసి..

Edited By:

Updated on: Mar 21, 2026 | 12:39 PM

కొన్ని సార్లు జంతువులు మనుషులను అనుకరిస్తూ వారు ఎలా ప్రవర్తిస్తాలో అవి కూడా అలా చేస్తూ ఉంటాయి.. ఒక్కోసారి వాటిప్రవర్తన చూస్తే అది నిజమే అనిపిస్తుంటుంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోనూ అలాంటి సంఘటనే వెలుగు చూసింది. ఓ గుడిలో మహిళలు పూజ చేస్తుండగా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ కొండముచ్చు.. వాళ్లతో పాటు పూజలో పాల్గొంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

1 / 5
జంతువులు మనషుల్లా ప్రవర్తించిన ఘటన మనం ఇప్పటి వరకు చాలానే చూశాం, ప్రతి రోజు ఆలయానికి వచ్చే గోవులు ప్రదక్షిణాలు చేయటం పలు సార్లు జరిగింది. నాగులచవితి రోజు, శివరాత్రి వంటి పర్వదినాల్లో పాములు టెంపుల్ లోకి ప్రవేశించి శివలింగానికి చుట్టుకోవడం, పడగవిప్పి భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించటం కూడా దైవ మహిమగా చెబుతారు.

జంతువులు మనషుల్లా ప్రవర్తించిన ఘటన మనం ఇప్పటి వరకు చాలానే చూశాం, ప్రతి రోజు ఆలయానికి వచ్చే గోవులు ప్రదక్షిణాలు చేయటం పలు సార్లు జరిగింది. నాగులచవితి రోజు, శివరాత్రి వంటి పర్వదినాల్లో పాములు టెంపుల్ లోకి ప్రవేశించి శివలింగానికి చుట్టుకోవడం, పడగవిప్పి భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించటం కూడా దైవ మహిమగా చెబుతారు.

2 / 5
అదే సందర్భంలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అమ్మవారి కుంకుమ పూజల్లో కొండముచ్చు పాల్గొనటం భక్తుల తో కలిసి పూజలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అక్కడ మహిళలు చేసినవిధంగానే కొండముచ్ చుకూడా అవే పనులు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగించింది.

అదే సందర్భంలో తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అమ్మవారి కుంకుమ పూజల్లో కొండముచ్చు పాల్గొనటం భక్తుల తో కలిసి పూజలు చేయటం చర్చనీయాంశంగా మారింది. అక్కడ మహిళలు చేసినవిధంగానే కొండముచ్ చుకూడా అవే పనులు చేస్తూ ఆశ్చర్యాన్ని కలిగించింది.

3 / 5
సాధారణం గా కోతులు, కొండముచ్చులను కూడా కొందరు మచ్చిక చేసుకుని తమ సొంత పనులు చేయిస్తూ ఉంటారు.కానీ ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండానే కొండముచ్చు గుడి దగ్గరకు వచ్చి నేరుగా పూజలో పాల్గొంది మానవుల లాగే అమ్మవారిని దర్శించుకుంది.

సాధారణం గా కోతులు, కొండముచ్చులను కూడా కొందరు మచ్చిక చేసుకుని తమ సొంత పనులు చేయిస్తూ ఉంటారు.కానీ ఇక్కడ ఎవరి ప్రమేయం లేకుండానే కొండముచ్చు గుడి దగ్గరకు వచ్చి నేరుగా పూజలో పాల్గొంది మానవుల లాగే అమ్మవారిని దర్శించుకుంది.

4 / 5
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లోని చెట్టు కింద ముత్యాలమ్మ ఆలయం ఉంది. అమ్మవారి గుడి దగ్గర మహిళలు పూజలు చేస్తూ ఉండగా ఎక్కడ నుండి వచ్చిందో ఒక కొండముచ్చుఆ ప్రదేశానికి వచ్చింది. మహిళలు పూజలు చేస్తుంటే వారి పక్కన కూర్చుని అమ్మవారికి నమస్కరిస్తూ పూజ అయ్యే వరకు అక్కడే తిరగాడింది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లోని చెట్టు కింద ముత్యాలమ్మ ఆలయం ఉంది. అమ్మవారి గుడి దగ్గర మహిళలు పూజలు చేస్తూ ఉండగా ఎక్కడ నుండి వచ్చిందో ఒక కొండముచ్చుఆ ప్రదేశానికి వచ్చింది. మహిళలు పూజలు చేస్తుంటే వారి పక్కన కూర్చుని అమ్మవారికి నమస్కరిస్తూ పూజ అయ్యే వరకు అక్కడే తిరగాడింది.

5 / 5
అక్కడు భక్తులను ఎవరినీ ఏమీ చేయక పోవడంతో మహిళలు కొండముచ్చు పక్కనే కూర్చుని పూజలు చేసి, వారిలో పాటు పూజలో పాల్గొన్న కోతికి సైతం ప్రసాదాలు పెట్టారు. వాటిని తింటూ కాసేపు అక్కడే తిరగాడింది ఆ కొండముచ్చు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఆలయానికి చేరుకొని కొండముచ్చును చూసేందుకు ఎగబడ్డారు.

అక్కడు భక్తులను ఎవరినీ ఏమీ చేయక పోవడంతో మహిళలు కొండముచ్చు పక్కనే కూర్చుని పూజలు చేసి, వారిలో పాటు పూజలో పాల్గొన్న కోతికి సైతం ప్రసాదాలు పెట్టారు. వాటిని తింటూ కాసేపు అక్కడే తిరగాడింది ఆ కొండముచ్చు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా ఆలయానికి చేరుకొని కొండముచ్చును చూసేందుకు ఎగబడ్డారు.

Follow Us