
Diabetes Control

కానీ వేసవి దొరికే ఈ కింది పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయట. వేసవిలో వచ్చే నేరేడు పండ్లు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా నేరుడు పండ్లలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ద్రాక్షలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ పండును పరిమిత పరిమాణంలో మాత్రమే తింటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. ద్రాక్షతో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అలాగే పోషకాలు అధికంగా ఉండే మరో పండు కివి. ఇందులో చక్కెర తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిక్ రోగులకు మేలు చేసే పండు. ఈ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఈ సీజన్లో వచ్చే పుచ్చకాయ కూడా డయామెటిక్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది. నీరు ఎక్కువగా ఉండే ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. పుచ్చకాయ మధుమేహ వ్యాధిగ్రస్తులను హైడ్రేట్ గా, రిఫ్రెష్ గా ఉంచుతుంది. అయితే పుచ్చకాయను పరిమిత పరిమాణంలో తినడం మంచిది.

మధుమేహం ఉన్నవారు ఆఫ్రికాట్ పండ్లను తినవచ్చు. దీనివల్ల చక్కెర శాతం కూడా తగ్గుతుంది. ఆఫ్రికాట్ పండ్లలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ ఎ, సి ఉన్నాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి.