
ఐపీఎల్ 17వ ఎడిషన్కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్పైనే ఉంది. ఈసారి టోర్నీని అమెరికా, వెస్టిండీస్లో నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందుతోన్న ఐదుగురు క్రికెటర్లు టీ20 ప్రపంచకప్ తర్వాత ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రోహిత్ శర్మ 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని చెప్పవచ్చు. దీనికి అతని వయసే ప్రధాన కారణమని చెప్పొచ్చు. టీ20 మినహా మిగతా రెండు ఫార్మాట్లపై రోహిత్ ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. భారత్ తరఫున ఇప్పటివరకు 151 టీ20 మ్యాచ్లు ఆడిన శర్మ 3974 పరుగులు చేశాడు.

షకీబ్ అల్ హసన్ 2006 నుంచి బంగ్లాదేశ్ తరఫున క్రికెట్ ఆడుతున్న అనుభవజ్ఞుడైన ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ కూడా 37 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. పెరుగుతున్న వయస్సు కారణంగా అతను కూడా ఈ ఫార్మాట్ నుంచి విరమించుకోవచ్చు. బంగ్లాదేశ్ తరఫున 122 టీ20 మ్యాచ్లు ఆడిన షకీబ్ 2440 పరుగులు, 146 వికెట్లు సాధించాడు.

డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా లెజెండరీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత 37 ఏళ్ల వార్నర్ టీ20 నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. వార్నర్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా తరఫున 103 టీ20 మ్యాచ్లు ఆడి 3099 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పొట్టి క్రికెట్కు రిటైర్మెంట్ ఇవ్వవచ్చు. జట్టులో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు కోహ్లి భారత్ తరఫున 117 టీ20 మ్యాచ్లు ఆడి 4037 పరుగులు చేశాడు.

ఏంజెలో మాథ్యూస్ 36 ఏళ్ల శ్రీలంక వెటరన్ ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ కూడా T20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ గురించి ఆలోచించవచ్చు. ఇప్పటికే లంక జట్టులో అవకాశాలు తక్కువగా అవకాశాలు అందుకుంటోన్న మాథ్యూస్ టీ20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేందుకు ఇదే సరైన సమయం. మాథ్యూస్ శ్రీలంక తరఫున 87 టీ20 మ్యాచ్లు ఆడి 1354 పరుగులు, 45 వికెట్లు పడగొట్టాడు.