ప్రతీ సీజన్ మాదిరిగానే.. ఈ ఐపీఎల్లోనూ ఆర్సీబీ పరిస్థితి ఏమాత్రం మారలేదు. ఆడిన మూడు మ్యాచ్ల్లో.. కేవలం ఒక్క మ్యాచ్లో గెలిచింది. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్.. అలాగే హోం గ్రౌండ్లో కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిపాలైంది. టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ, ఫినిషర్గా దినేష్ కార్తీక్ వారి స్థాయికి తగ్గట్టు ఆడుతుండగా.. మిగిలినవారు ఏమాత్రం రాణించలేకపోతున్నారు.
ఈ సీజన్లో బెంగళూరు జట్టు వరస్ట్ టీం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కనపెడితే.. ఒక్కప్పుడు ఆర్సీబీలో ఆడుతూ.. పేలవ ప్రదర్శన కనబరిచిన కొందరు ప్లేయర్స్.. ఇప్పుడు ఆ జట్టు నుంచి బయటకొచ్చి.. ఐపీఎల్ను శాసిస్తున్నారు. ప్రస్తుత సీజన్లో ఐపీఎల్ను శాసిస్తున్న ఆర్సీబీ మాజీ ప్లేయర్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
ఆశిష్ నెహ్రా.. ఈ టీమిండియా మాజీ పేసర్.. కొంతకాలం ఆర్సీబీ టీంలో ఉన్నాడు. దరిద్రేమో గానీ.. అప్పుడు పెద్దగా రాణించలేకపోయాడు. ఇక ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్గా మారి.. ఐపీఎల్ను శాసిస్తున్నాడు. ఆ జట్టును ఐపీఎల్ 2022లో ఛాంపియన్గా, ఐపీఎల్ 2023లో రన్నరప్గా నిలిపాడు.
శివమ్ దూబే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఓ అనామకుడిగా ఉన్న శివమ్ దూబే.. చెన్నైకి మారిన తర్వాత హార్డ్ హిట్టర్ అయ్యాడు. అలాగే టీమిండియాలోనూ చోటు దక్కించుకున్నాడు. తన ఆటతీరును కూడా గణనీయంగా పెంచుకున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్.. ఈ దక్షిణాఫ్రికా ప్లేయర్ కూడా ఒకప్పుడు ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. బహుశా ఈ విషయం ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కేవలం రూ. 50 లక్షలకే ఆర్సీబీ 2019లో క్లాసెన్ను దక్కించుకుంది. అప్పుడు పెద్దగా రాణించలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు హైదరాబాద్ తరపున ఊచకోతే.
ట్రావిస్ హెడ్.. ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్ కూడా ఒకప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరపున ఆడాడు. 2016, 2017 సీజన్స్లో హెడ్ ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు రాణించలేదు.. కానీ ఇప్పుడు హైదరాబాద్ తరపున దుమ్మురేపుతున్నాడు. ఇలా ఆర్సీబీకి చెందిన ఈ నలుగురు మాజీ ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్ను శాసిస్తున్నారు.