
భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ ముగిసింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్కు సిద్ధమవుతున్నారు. అంటే వచ్చే వారంలోనే భారత ఆటగాళ్లు ఐపీఎల్ జట్లలో చేరనున్నారు.

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభమై మే నెలాఖరు వరకు టోర్నీ జరగనుంది. అందువల్ల వచ్చే 2 నెలల పాటు టీమ్ ఇండియా ఆడదు. మరి భారత జట్టు తదుపరి మ్యాచ్లు ఎక్కడ, ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

టీ20 ప్రపంచ కప్ 2024: టీ20 ప్రపంచ కప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరుగుతుంది. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరగనున్న ఈ ప్రపంచకప్ తర్వాతే భారత జట్టు సిరీస్ ఆడనుంది.

భారత్ వర్సెస్ జింబాబ్వే: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జులై 6 నుంచి ప్రారంభమై జులై 14న ముగుస్తుంది.

భారత్ వర్సెస్ శ్రీలంక: శ్రీలంకతో టీమిండియా 6 మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. జులై-ఆగస్టు నెలలో జరిగే ఈ సిరీస్లో ఇరు జట్లు 3 వన్డేలు, 3 టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి.

భారత్ vs బంగ్లాదేశ్: సెప్టెంబర్ నెలలో బంగ్లాదేశ్తో భారత జట్టు 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది.

భారత్ వర్సెస్ న్యూజిలాండ్: అక్టోబర్లో భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో తలపడనున్నాయి.

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్-డిసెంబర్లో జరగనుంది. ఈ సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు మొత్తం 5 టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి.