
Rohit Sharma: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేందుకు భారత్ సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ ఏడాది కంటే తక్కువ వ్యవధిలో తన రెండవ ఐసీసీ ట్రోఫీని గెలుచుకోవాలని చూస్తున్నాడు. అయితే, దీని కోసం మొత్తం బృందం కృషి చేయాల్సి ఉంటుంది. టోర్నమెంట్లో ఇప్పటివరకు రోహిత్ శర్మ బ్యాటింగ్తో మంచి ప్రదర్శన ఇవ్వలేదు. అయితే, టైటిల్ పోరులో తన బ్యాట్ పవర్ని చూపించాలనుకుంటున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ కూడా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 79 పరుగులు చేయడం ద్వారా, అతను ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా మారవచ్చు.

రోహిత్ శర్మ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో 421 పరుగులు చేశాడు. అతను ఫైనల్లో 79 పరుగులు చేయగలిగితే, ఈ మైదానంలో 500 వన్డే పరుగులు చేసిన చరిత్రలో మొదటి ఆటగాడిగా నిలిచేవాడు. అతను ఇంకా 4 పరుగులు చేస్తే, స్కాట్లాండ్కు చెందిన రిచీ బెర్రింగ్టన్ను అధిగమించి ఈ వేదికపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు అర్హత సాధించడం ద్వారా, రోహిత్ శర్మ చరిత్రలో ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ల ఫైనల్స్కు తన జట్టును నడిపించిన తొలి కెప్టెన్గా నిలిచాడు. 25 సంవత్సరాల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో న్యూజిలాండ్పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని రోహిత్ శర్మ, అతని బృందం ఇప్పుడు చూస్తోంది. భారత్ చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్కు చెందిన మిచెల్ సాంట్నర్, మైఖేల్ బ్రేస్వెల్లు స్పిన్ బౌలర్లుగా కనిపించనుండగా.. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలతో కూడిన దేశీయ స్పిన్ క్వార్టెట్ భారత్ తరపున బరిలోకి దిగే అవకాశం ఉంది.

గత మ్యాచ్లో, న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ (10-1-41-1) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కానీ, బ్రేస్వెల్ (9-0-56-0) కొంచెం ఖరీదైన వాడిగా మారాడు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటివరకు 4 మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టారు. రచిన్ రవీంద్ర (6-0-31-1) కూడా ఎడమచేతి వాటం స్పిన్తో మంచి స్పెల్ను వేశాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ స్పిన్నర్లకు కొంత సహాయపడుతుందని భావిస్తున్నారు. కాబట్టి, భారత బ్యాట్స్మెన్స్ ఎలా అడ్డుకుంటారో చూడాలి.