
IPL (IPL 2024) 52వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. బెంగళూరులో శుక్రవారం భారీ వర్షం కురిసింది, శనివారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని సమాచారం.

వాతావారణ నివేదిక ప్రకారం, బెంగళూరులో మధ్యాహ్నం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

వర్షం కురిసినా.. చిన్నస్వామి స్టేడియంలోనే మ్యాచ్ జరగనుంది. ఎందుకంటే బెంగుళూరులోని చిన్నస్వామి గ్రౌండ్లో సబ్-ఎయిర్ సిస్టమ్ ఉంది. ఇది భూమి నుంచి నీటిని త్వరగా పీల్చుకుంటుంది. ఇలా ఎంత వర్షం కురిసినా కొద్ది నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేసుకోవచ్చు.

1 గంట పాటు నిరంతరం వర్షం పడితే, గ్రౌండ్ లోపల ఉన్న సబ్ ఎయిర్ సిస్టమ్ ద్వారా 10 నుంచి 15 నిమిషాల్లో పిచ్ను సిద్ధం చేయవచ్చు. భూమిని త్వరగా ఆరబెట్టడానికి పైపుల ద్వారా వేడి గాలిని పంపే సబ్-ఎయిర్ సిస్టమ్ కూడా ఉంది.

కాబట్టి, నిరంతర వర్షంపడినా.. మ్యాచ్ ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండు. అయితే, RCB-గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్లో ఓవర్లు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి, బెంగళూరు అంతటా వర్షం కురిసినా RCB vs GT మ్యాచ్ ఈరోజు జరుగుతుందని చెప్పవచ్చు.