
ఆకు కూరలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆకు కూరల్లో అనేక రకాల పోషకాలు లభిస్తాయి. వారంలో రెండు, మూడు సార్లు అయినా ఆకు కూరలు వండుకుని తినడం చాలా మంచిది. ఆకు కూరలు తినడం వల్ల శరీరంలో ఉండే మలినాలు అన్నీ పోతాయి.

అయితే ఆకు కూరల్ని ఎలా వండాలో చాలా మందికి తెలీదు. తెలీకుండా ఎలా పడితే అలా వండటం వల్ల పోషకాలు అన్నీ పోతాయి. దీని వల్ల ఆకు కూరల్ని తిన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరి ఆకు కూరల్ని ఎలా వండితే ప్రయోజనాలు అందుతాయో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా ఆకు కూరల్ని కట్ చేసి కడుగుతారు. కానీ ముందు కడిగేసి కట్ చేయడం వల్ల పోషకాలు ఉంటాయి. ఒక వేళ ఇలా చేయడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే.. కట్ చేశాక కడిగి, కాసేపు వేడి నీళ్లు పోసి ఉంచండి. ఇలా చేయడం వల్ల పోషకాలు అందుతాయి.

అదే విధంగా ముందుగానే ఆకు కూరల్ని స్టీమ్ చేసి వండటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మరీ ఎక్కువ సేపు ఉడికించినా కూడా పోషకాలు అనేది అందవు. కాబట్టి ఎక్కువ సేపు వేయించకుండా వండాలి.

ఆకు కూరలు వండేటప్పుడు ఆయిల్తో కాకుండా వెన్న, నెయ్యితో వండితే పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి. మరీ ఎక్కువగా నెయ్యి కాకుండా.. కొద్దిగా ఆయిల్ కూడా వాడుకోవచ్చు. పెద్ద మంట మీద కుండా.. చిన్న మంట మీద ఉడికిస్తే పోషకాలు లభిస్తాయి.