
బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఈ అన్స్టాపబుల్ షో ఈరోజు రాత్రి 8.30 నిమిషాలకు ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సీజన్ లెజెండరీ నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం 50 సంవత్సరాల స్మారక వేడుకను జరుపుకోవడంతోపాటు మరింత ప్రత్యేకం కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలకు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ షోలో తమ సినీ ప్రయాణం, వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు. గతంలోనే టీడీపీ అధినేత ప్రతిపక్ష హోదాలో ఈ షోలో పాల్గొని తన రాజకీయ జీవితం, పర్సనల్ విషయాల గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈరోజు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అన్స్టాపబుల్ టాక్ షో మొదటి ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడుతో ప్రారంభంకానుంది. ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలకు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కోసం ఎదురుచూస్తున్నామంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు.

రాజమౌళి బాహుబలితో ముందడుగు వేసి,మన సినిమాలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో రాచబాట వేశారని చెప్పారు.

కానీ.. ఇన్నేళ్ల ఎక్స్ పీరియన్స్ తర్వాత భయపడటం తగదని, ఈ స్క్రిప్ట్ ని యాక్సెప్ట్ చేశారట సూర్య. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసి వారెవా.. మనం చేయలేమా అనుకునేవాళ్లమని గుర్తుచేశారు నడిప్పిన్ నాయగన్.