
నార్త్ సినిమాల్లో సౌత్ టాప్ స్టార్స్, సాత్ సినిమాలో నార్త్ టాప్ హీరోలు నటించటం ఇప్పుడు ట్రెండ్గా మారింది. తాజాగా ఇలాంటి మాసివ్ కాంబోస్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు యష్. కథ డిమాండ్ చేస్తే... భారీ సినిమాల కోసం కాస్త తగ్గటంలో తప్పులేదన్నారు రాకీభాయ్. దీంతో అలా కాస్త తగ్గి సినిమాలు చేస్తున్న స్టార్స్ గురించి చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్.

కేజీఎఫ్ సక్సెస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన యష్, ఇప్పుడు టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నటిస్తూనే బాలీవుడ్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణంలో రావణాసురుడిగా నటిస్తున్నారు. అయితే టాప్ స్టార్ కూడా అవసరమైతే ఇతర హీరోల సినిమాల్లో నెగెటివ్ రోల్ చేయటం ఇండస్ట్రీకి అవసరం అంటున్నారు యష్. భారీ బడ్జెట్తో పెద్ద కథలు చెప్పాలంటే స్టార్స్ కాస్త తగ్గాల్సిందే అన్నారు.

యష్ మాత్రమే కాదు... టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ కూడా వార్ 2 విషయంలో కాస్త తగ్గి ఒప్పుకున్నారు. వార్ సిరీస్లో హీరోగా హృతిక్ పేరునే మేజర్గా ప్రొజెక్ట్ చేస్తోంది బాలీవుడ్. అయినా... భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న వార్ 2లో ఎన్టీఆర్ లీడ్ రోల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాలీవుడ్లో సోలో హీరోగా సినిమాలు చేస్తూనే నార్త్లో హృతిక్ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు.

మలయాళ టాప్ హీరో పృథ్వీరాజ్సుకుమారన్ అయితే ప్రతీ లాంగ్వేజ్లోనూ తన మార్క్ ఉండేలా చూసుకుంటున్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమాలో కీ రోల్లో నటించారు. పార్ట్ 2లో ఆయనే మెయిన్ విలన్గా కనిపించబోతున్నారు. రీసెంట్గా అక్షయ్కుమార్, టైగర్ ష్రాఫ్ లీడ్ రోల్స్లో తెరకెక్కిన బడే మియా చోటే మియా మూవీలోనూ విలన్గా కనిపించారు.

నార్త్ స్టార్స్ కూడా సౌత్ సినిమాలకు అలాగే సపోర్ట్ చేస్తున్నారు. బాలీవుడ్లో సోలో హీరోగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అజయ్ దేవగన్, ట్రిపులార్ సినిమాలో గెస్ట్ రోల్లో కనిపించారు. ట్రిపులార్ లాంటి బిగ్ ప్రాజెక్ట్కు పాన్ ఇండియా మార్కెట్ రావలంటే తన సపోర్ట్ అవసరం అన్న ఉద్దేశంతోనే గెస్ట్ రోల్కు ఓకే చెప్పారు.