
యానిమల్ విజయంతో రష్మిక మందన్న బాలీవుడ్లో హాట్ కేక్ అయిపోయారు.. ఆమె కోసం స్టార్ హీరోలు వేచి చూస్తున్నారు.. నిర్మాతలు క్యూ కడుతున్నారు.. అమ్మడి పర్ఫార్మెన్స్కు అంతా ఫిదా అయిపోయారు. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో సినిమాలు చేస్తారా..? ప్రస్తుతం నటిస్తున్న పుష్ప 2 పక్కనబెడితే.. ఇంకేమైనా సినిమాలు ఒప్పుకుంటారా..? యానిమల్ తర్వాత రష్మిక ప్లానింగ్ ఏంటి..?

యానిమల్ ముందు వరకు రష్మిక మందన్న కెరీర్ అంతంతమాత్రంగానే ఉంది. బాలీవుడ్లో చేసిన రెండు సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు.. ఇలాంటి టైమ్లో వచ్చిన యానిమల్తో అమ్మడి రేంజ్ మారిపోయింది. దెబ్బకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. యానిమల్ సక్సెస్తో అసలైన పాన్ ఇండియన్ హీరోయిన్గా మారిపోయారు ఈ బ్యూటీ.

సౌత్ సినిమాకు దూరంగా ఉండి.. బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు రష్మిక. అందుకే పుష్ప 2తో పాటు మరో నాలుగు సినిమాలు చేస్తున్నా.. ఏ ఒక్కటి రీజినల్ సినిమా లేదు.. అన్నీ పాన్ ఇండియన్ లేదంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాలే. గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న. వీటితో ఈ బ్యూటీ మార్కెట్ పెరుగుతుందా అనేది ఆసక్తికరమే.

యానిమల్ బ్లాక్బస్టర్ తర్వాత బాలీవుడ్లో రష్మిక కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్కు కూడా రెక్కలొచ్చేసాయి. ప్రస్తుతం షాహిద్ కపూర్తో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇక పుష్ప 2 ఎలాగూ ఉంది.

వీటితో పాటు తాజాగా ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో రానున్న పాన్ ఇండియా సినిమాలోనూ రష్మికనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇలా కేవలం పాన్ ఇండియా లేదంటే హిందీ సినిమాలకు మాత్రమే ఓకే చెప్తున్నారు నేషనల్ క్రష్.