
మల్టీస్టారర్ మూవీస్లో గోల్డెన్ లెటర్స్ లో రాసుకోవాల్సిన పేరు ట్రిపుల్ ఆర్. తారక్, చరణ్ కలిసి నటించిన ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకుంటూనే ఉన్నారు జనాలు... ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా డిస్కషన్లోనే ఉంటుంది ఈ సినిమా. రీజన్ ఏంటంటారా? చూసేద్దాం రండి.

రాజమౌళి సినిమాలో నటించడమంటే ఏళ్లకు ఏళ్లు ఆయనకు రాసిచ్చేయడమే అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. అలా తారక్ అండ్ చెర్రీ కలిసి జక్కన్నకు కొన్నేళ్లు రాసిచ్చారు. దానికి తగ్గ రిజల్ట్ ఆస్కార్ లెవల్లో వినిపించింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ సినీ పటం మీద సగర్వంగానూ నిలిపింది

ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ నుంచి ఇప్పటిదాకా సినిమా రాలేదు. చెర్రీ నుంచి ఆచార్య వచ్చినా, దాని సౌండ్ పెద్దగా లేదు. పైగా ఇద్దరు హీరోలూ 2023ని మిస్ అయ్యారు. అందుకే ఈ స్టార్లిద్దరి ఫ్యాన్స్ 2024 మీదే ఆశలు పెంచుకుంటున్నారు.

2024 సమ్మర్కి ఆల్రెడీ ఖర్చీఫ్ వేసుకున్నారు తారక్. దేవర పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అటు రామ్చరణ్ కూడా గేమ్ చేంజర్ షూటింగ్ కోసం త్వరలోనే మైసూర్కి వెళ్లనున్నారు. దిల్రాజు అత్యంత ప్రెస్టీజియస్గా నిర్మిస్తున్నారు గేమ్ చేంజర్ని. అయితే రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వాల్సింది శంకరే అనేది మేకర్స్ మాట.

సో సమ్మర్లో తారక్, ఆ తర్వాతైనా చరణ్.. .2024లో ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు. సో, దేవర, గేమ్ చేంజర్ రిలీజ్ సమయాల్లో కచ్చితంగా ట్రిపుల్ ఆర్ ప్రస్తావన వచ్చితీరుతుందన్నమాట.